Home » చిరు రిక్షావోడు మూవీతో ఆమనికి అన్యాయం..ఆ డైరెక్టర్ వల్లేనా..?

చిరు రిక్షావోడు మూవీతో ఆమనికి అన్యాయం..ఆ డైరెక్టర్ వల్లేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగాస్టార్ సినిమా వచ్చింది అంటే ఫ్యాన్స్ కు పండగే పండగ.. అలాంటి మెగాస్టార్ సినీ కెరియర్ లో మంచి గుర్తింపు సాధించిన చిత్రం రిక్షావోడు. ఈ మూవీ 1995లో విడుదలైంది. ఈ చిత్రం చిరంజీవికి అంతగా హిట్ ఇవ్వలేదు కానీ, ఇందులోని పాటలు మంచి పేరు తీసుకువచ్చాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆర్ నారాయణ మూర్తి ఒరేయ్ రిక్షా మూవీ సూపర్ హిట్ అయింది.

Advertisement

Also Read:సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

దీంతో చిరు అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఒరేయ్ రిక్షా చిత్రానికి దాసరి నారాయణరావు డైరెక్టర్. అయితే రిక్షావోడు సినిమా విఫలం అవ్వడానికి కారణం ఫ్లాష్ బ్యాక్ సరిగ్గా లేకపోవడం అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక అలాంటి రిక్షావోడు సినిమాలో ముందుగా హీరోయిన్స్ గా ఆమని, సౌందర్యను ఎంపిక చేసారట. మొదట ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడిగా ఎంపికయ్యారు.

Advertisement

Also Read:ఇన్ ఫ్లూయెంజాతో ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..!

కానీ కొన్ని కారణాలవల్ల ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో కోడి రామకృష్ణ ఎంటరై ఇందులో ఆమనినీ హీరోయిన్ గా తప్పించి, ఆ ప్లేస్ లో నగ్మని తీసుకొచ్చారట. ఇక సౌందర్య అలాగే ఉందనీ ఆమనీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.. అయితే చిరంజీవి గారు తనకు ఎంతో ఇష్టమైన హీరో అని, సౌందర్య తన బెస్ట్ ఫ్రెండ్ అని వీరిద్దరితో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందించానని, కానీ మధ్యలోనే నన్ను సినిమా నుంచి తీసేయడం బాధ పెట్టిందని ఎమోషనల్ అయింది ఆమని.

Also Read:44 బంతుల్లోనే సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆటగాడు..!

Visitors Are Also Reading