నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా, పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ విపరీతమైన క్రేజ్ వచ్చింది. రెండో సీజన్ లో మొదటి గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ తన కెరియర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ టాక్ షో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే పవన్ మొదటి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అయింది. తాజాగా రెండో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. ఈ ప్రోమో చూస్తుంటే పవన్ తన లైఫ్ లో జరిగిన కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.
Advertisement
అన్నయ్య తుపాకితో కాల్చుకుందాం అనుకున్నానని ఈ షోలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘చిన్నప్పటి నుంచి అస్తమా, జ్వరం ఉండేవి. ఆరు, ఏడు తరగతుల్లో ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. సరైన స్నేహితులు లేక ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చేది. పుస్తకాలే స్నేహితులుగా గడిపాను. పాఠశాల, కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా అనిపించేది. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదు. ఆ క్రమంలో ఉపాధ్యాయులు నచ్చేవాళ్ళు కాదు. సెల్ఫీ లెర్నింగ్ లో నడిచాను. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్ లో రాణిస్తున్న వేళ నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను.
Advertisement
ఆత్మాన్యూనతాభావం ఉండేది’ అని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. ’17 ఏళ్ల వయసులో మానసికంగా కుంగిపోయా. చనిపోతే బాగుండు అనిపించింది. అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకొని కాల్చుకుందాం అనుకున్నా. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారు. కాల్చుకుందాం అనుకుంటున్నా అని చెప్పడంతో వారు చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు. పరీక్షలపై దిగులతో ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నువ్వేం చదవకపోయినా పర్లేదు, బతికి ఉండరా అని చెప్పారు’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
READ ALSO : Naga Shaurya : ఆకట్టుకుంటున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్!