ప్రస్తుత సమాజంలో మానవసంబంధాలు మంటకలుస్తున్నాయి. అక్రమసంబంధాలు పెరిగిపోతున్నాయి. దాంతో నేరాలు ఘోరాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒక దగ్గర అక్రమసంబంధాల వల్ల కాపురాలు కూలిపోతూ ఉన్నాయి. అక్రమసంబంధంతో ప్రియుడి మోజులో భర్తలను అడ్డు తొలగించుకునేందుకు భార్యలు..ప్రియురాలి మోజులో భార్యలను అడ్డుకునేందుకు దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని కథల్లో పిల్లలను విడిచిపెట్టి ఇంటినుండి దూరంగా పారిపోతున్నారు.
Advertisement
తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీనివాస్ శ్రీకాంత్ పేర్లు మార్చాం ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు…శ్రీనివాస్ తో ఉన్న స్నేహంతో శ్రీకాంత్ తరచూ అతడి ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ భార్య మౌనికతో శ్రీకాంత్ కు పరిచయం ఏర్పడింది. స్నేహితుడే కదా అని శ్రీనివాస్ తప్పుగా ఆలోచించలేదు. కానీ ఆ పరిచయం కాస్తా శ్రీకాంత్, మౌనిక ల మధ్య అక్రమసంబంధానికి దారితీసింది.
Advertisement
కానీ అప్పటికే శ్రీనివాస్ మౌనికలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మౌనికను హెచ్చరించినప్పటికీ ఆమెలో మార్పురాలేదు. ఇక గత నెల 30న శ్రీకాంత్ కు మరో యువతితో వివాహం జరిగింది. కాగా మౌనిక ఫోన్ లో ఎక్కువగా మాట్లాడటం శ్రీనివాస్ గమనించి ఆమెను పద్దతిమార్చుకోవాలని హెచ్చరించాడు. కట్ చేస్తే ఇంట్లో భార్య ఇద్దరూ పిల్లలు మాయమైపోయారు.
మరోవైపు శ్రీనివాస్ స్నేహితుడు శ్రీకాంత్ కూడా పెళ్లైన పదిరోజులకే మాయమయ్యాడు. తన భార్య కనిపించడం లేదంటూ శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ భార్య పెళ్లైన పదిరోజులకే తన భర్త మరో మహిళతో పరార్ అయ్యాడంటూ తన జీవితం ఏంకావాలంటూ శ్రీకాంత్ తండ్రిని తన మామనను నిలదీసింది. దాంతో తన కొడుకు నాలుగు రోజుల్లో రాకపోతే ఆస్తిమొత్తం నీ పేరు మీద రాస్తానని మౌనికకు హామీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం పోలీసులు శ్రీకాంత్, మౌనికలను పట్టుకునే పనిలో ఉన్నారు.
ALSO READ :
డ్రైవర్ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రి రూ.2కోట్ల జాక్పాట్..!