Home » ఐపీఎల్ వేలం గురించి ర‌విశాస్త్రీ ఏమ‌న్నారో తెలుసా..?

ఐపీఎల్ వేలం గురించి ర‌విశాస్త్రీ ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

ఐపీఎల్ అంటే అదొక క్రేజీ ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్ర‌తీ సీజ‌న్‌లో ప్ర‌తి ఒక్క‌రికీ ఓ పండుగ‌లాంటి వాతావ‌ర‌ణం ఉంటుంది. క్రీడాభిమానులు ఎంతో ఆస‌క్తిక‌రంగా, ర‌స‌త్తంగా మ్యాచ్‌లు జ‌రుగుతుంటాయి. ఇక అందులో సూప‌ర్ ఓవ‌ర్ లాంటి మ్యాచ్‌లు క్రికెట్ లో ఎక్కువ‌గా ఐపీఎల్‌లో నే చూస్తుంటాం.


అప్ప‌ట్లో టీ-20 లీగ్ ఉండిఉంటే నేటి దిగ్గ‌జాల‌కు వేలంలో ఎంత ధ‌ర ప‌లికేద‌నే ఆలోచ‌న అభిమానుల‌కు వ‌స్తూ ఉంటుంది. ఎంత అనే ప్ర‌శ్న‌కు మాత్రం స్ప‌ష్టమైన స‌మాధానం మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. కానీ మాజీ ఆల్‌రౌండ‌ర్ ర‌విశాస్త్రీ మాత్రం ఇప్ప‌టి మాదిరిగా త‌న‌కు రూ.15కోట్ల‌కు పైగా ధ‌ర ప‌లికేద‌ని పేర్కొన్నాడు. ఒక జ‌ట్టుకు కెప్టెన్ అయితే మీరు వేలంలో ఎంత‌కు అమ్ముడు పోయేవారు అని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగిన ప్ర‌శ్న‌కు ర‌విశాస్త్రీ ఇటీవ‌ల స‌మాధానం చెప్పాడు.

Advertisement

Advertisement


ఐపీఎల్ వేలంలో క‌చ్చితంగా రూ.15కోట్లు వ‌చ్చేవ‌ని.. అదేవిధంగా ఒక జ‌ట్టుకు కెప్టెన్ అయి ఉండేవాడిని. ఇది ఎవ్వ‌రు అయినా చెప్ప‌గ‌ల‌రు అని రవిశాస్త్రీ చెప్పుకొచ్చాడు. అత‌ను 80 టెస్ట్‌ల్లో 3,108 ప‌రుగులు చేశాడు. 151 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వ‌న్డేల‌లో 129 వికెట్లు తీశాడు. అప్ప‌ట్లో ఒక రంజీట్రోపీలో మ్యాచ్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించాడు.

Also Read :  ఆ రెండు ఆర్ఆర్ఆర్ కు మైన‌స్సే….ఒప్పుకున్న విజ‌యేంద్ర ప్ర‌సాద్…!

Visitors Are Also Reading