సమంత ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సమంత తన అద్భుతమైన నటన, అందం, చలాకీతనంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఫిదా చేసింది. ఈ భామ గత కొద్దిరోజుల నుంచి సౌత్ లో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. కొద్ది రోజుల క్రితం సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది సమంత.
Advertisement
కానీ సౌత్ ఇండస్ట్రీపైన తను ఎలాంటి ఆసక్తిని చూపించడం లేదు. ఎక్కువగా తన పూర్తి దృష్టిని బాలీవుడ్ ఇండస్ట్రీపైనే పెడుతుంది ఈ అమ్మడు. ఖుషి సినిమా సక్సెస్ అనంతరం సమంత చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ అనంతరం సమంత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి రియాల్టీ షోస్ ని ప్రజెంట్ చేస్తోంది. దీంతో సమంత నటనకు దూరం అవుతుందా అన్న అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.
కానీ అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దని ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా సమంత సల్మాన్ నటించబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి ఓకే చెప్పిందనే వార్త వైరల్ అవుతుంది. మొన్నటివరకు త్రిష హీరోయిన్ గా నటిస్తుందనుకున్న ఆ సినిమాలో ఇప్పుడు త్రిషని పక్కన పెట్టేసి సమంతను హీరోయిన్గా ఫిక్స్ చేశారని ఓ వార్త వైరల్ అవుతుంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా చేయబోయే “ది బుల్” సినిమాలో సమంత హీరోయిన్గా చేస్తారనేది లేటెస్ట్ అప్డేట్. ఈ విషయాన్ని సమంత అఫీషియల్ గా చెబితే వినాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు సమంత ఫ్యాన్స్.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి