Home » 30 ఇయర్స్ పృథ్వీ కూతురు టాలీవుడ్ హీరోయిన్ అన్న సంగతి తెలుసా.. ? ఆమె ఎవరంటే…?

30 ఇయర్స్ పృథ్వీ కూతురు టాలీవుడ్ హీరోయిన్ అన్న సంగతి తెలుసా.. ? ఆమె ఎవరంటే…?

by AJAY
Published: Last Updated on
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ లుగా బిజీగా ఉన్న వారిలో 30 ఇయర్స్ పృథ్వి కూడా ఒకడు. 30 ఇయర్స్ పృథ్వి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. కానీ ఆ తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పి మళ్లీ పృథ్వీ సినిమాల వైపుకు అడుగులు వేశాడు.

Also Read: ఈవారం థియేటర్ / ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు ఇవే..!

Advertisement

Also Read: ఆ గొడవల వల్లే అల్లు అర్జున్ తో జక్కన్న సినిమా చేయడం లేదా..? ఆ గొడవలు ఏంటి..!

లౌక్యం, అత్తారింటికి దారేది, దూకుడు సినిమాతో పాటు వందల చిత్రాల్లో నటించి పృథ్వీ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ కామన్ అన్న సంగతి తెలిసిందే. ఇక కమెడియన్ పృథ్వికూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పృథ్వి కూతురి పేరు శ్రీలు కాగా ఇప్పటికే ఆమె ఓ సినిమాలో నటించింది.

Advertisement

కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇక ఇప్పుడు పృథ్వీ స్వీయ దశకత్వంలో ఆయన కూతురును హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తున్నాడు. కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకు పృథ్వీ దర్శకత్వం వహిస్తుండగా ఆ సినిమాలో శ్రీలు హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read:  ఆ అలవాటు వల్లే తారకరత్న కు గుండెపోటు వచ్చిందా…? షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత…!

ఈ చిత్రంలో క్రాంతి కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంతో సక్సెస్ అయిన పృథ్వీ కూతురు ఇండస్ట్రీలో రాణిస్తుందా లేదా చూడాలి.

Visitors Are Also Reading