Home » నందమూరి ఫ్యామిలీ అలా చేసిందా..? తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్..!

నందమూరి ఫ్యామిలీ అలా చేసిందా..? తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్..!

by Anji

నందమూరి తారకరత్న మరణాన్ని తన భార్య అలేఖ్యరెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. కుటుంబ సభ్యులకే కాదు.. తారకరత్న మరణం టాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. యావత్ సినీ ప్రపంచం ఆయన మరణాన్ని తలచుకొని శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరోగా టీడీపీ నాయకుడిగా తారకరత్న తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారు. 

గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న తారకరత్న రాజకీయా్లో రాణిస్తారని అందరూ భావించారు. కానీ నారా లోకేష్ పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన ఆయన భార్య అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాల ఓ ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూనే ఉన్నారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసే పోస్టులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన మరో ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. 

మన పిల్లల కోసం నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. నా వరకు నువ్వెే నా బలం.. నువ్వు నాకు కావాలి నాన్న. నేను బాధపడుతున్నాను. ఒంటరిగా ఉన్న ఓటమిలో పైకి లేపేందుకు నువ్వు నాకు కావాలి. నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజూ అంటూ వస్తుందని అనుకోలేదు. నువ్వు ఎప్పుడూ పై నుంచి నన్ను చేస్తూనే ఉంటావని నాకు తెలుసు. నీ కోసం నా గుండెల్లో నుంచి రక్తం కారుతుంది బంగారం.. ఇలాంటి గందరగోళంలో నువ్వు నా తోడు లేవని బాధగా ఉంది” అంటూ రాసుకొచ్చింది. దీంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్న ఫ్యామిలీని పట్టించుకోవడం లేదని అందుకే ఆమె ఇలా బాధపడిపోతుందని నందమూరి ఫ్యామిలీ పై మండిపడుతున్నారు. ఈ ఇష్యూని ఎక్కడికో లాగి లింక్ పెట్టి నందమూరి ఫ్యామిలీని ట్రోల్స్ చేస్తున్నారు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading