Home » ఎవ‌డు సినిమాలో ఈ త‌ప్పును గ‌మ‌నించారా…డైరెక్ట‌ర్ దారుణంగా మోసం చేశాడుగా…!

ఎవ‌డు సినిమాలో ఈ త‌ప్పును గ‌మ‌నించారా…డైరెక్ట‌ర్ దారుణంగా మోసం చేశాడుగా…!

by AJAY
Ad

మెగాహీరోలు రామ్ చ‌ర‌ణ్ అల్లు అర్జున్ క‌లిసి న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఎవ‌డు. ఈ సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలో హీరోయిన్ లుగా శృతి హాస‌న్ మ‌రియు కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమా ఫేస్ ఆఫ్ ను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని వంశీపైడిప‌ల్లి రాశార‌ని చెబుతుంటారు. ఇక ఈ సినిమా మిగ‌తా మ‌ల్లీ స్టారర్ సినిమాల్లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.

Advertisement

 

నిజానికి సినిమాలో హీరో రామ్ చ‌ర‌ణ్ ఆ లేదంటే అల్లు అర్జున్ ఆ అనే అనుమానం కూడా వ‌స్తుంది. ఎందుకంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పై దుండ‌గులు దాడి చేస్తారు. ఈ దాడిలో అత‌డి ముకం పూర్తిగా కాలిపోతుంది. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ ఓ ఫైట్ లో ప్రాణాలు కోల్పోతాడు.

Advertisement

దాంతో రామ్ చ‌ర‌ణ్ త‌ల్లి డాక్ట‌ర్ అవ్వ‌డంతో అత‌డి ముఖాన్ని అల్లు అర్జున్ కు ప్లాస్టిక్ స‌ర్జరీ ద్వారా అమ‌రుస్తుంది. అయితే ఈ డిఫ‌రెంట్ సినిమా కొంత‌మందికి న‌చ్చ‌లేదు కూడా..కానీ మొత్తంగా చూసుకుంటే సినిమాకు హిట్ టాక్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు ఓ మిస్టేక్ కూడా చేశాడు.

ALSO READ : రాజమౌళి కి జగపతిబాబు కి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా ?

సాధార‌ణంగా ప్లాస్టిక్ స‌ర్జరీ చేస్తే మారేది ముఖం మాత్ర‌కే కానీ ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ముకాన్ని అల్లు అర్జున్ బాడీకి అమ‌రుస్తారు. అయితే ఆ త‌ర‌వాత అల్లు అర్జున్ వాయిస్ కూడా మారిపోయి రామ్ చ‌ర‌ణ్ వాయిస్ వ‌స్తుంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు ప‌ప్పులో కాలేశాడు. ఇక అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా ప్రభావం ఎక్కువ లేక‌పోవ‌డంతో త‌ప్పించుకున్నాడు. ఇప్పుడు దాన్ని గుర్తుకు తెచ్చి మీమ్స్ వేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading