Home » విశాఖ ఉక్కు ప్రైవేటీకర‌ణ‌కు నిర‌స‌న‌గా వైసీపీ వినూత్న నిర‌స‌న

విశాఖ ఉక్కు ప్రైవేటీకర‌ణ‌కు నిర‌స‌న‌గా వైసీపీ వినూత్న నిర‌స‌న

by Anji
Ad

విశాఖ ఉక్కును ప్ర‌యివేటీక‌రించే దిశ‌గా సాగుతున్న కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికీ నిర‌స‌న‌గా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిర‌స‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా తాము చేప‌ట్ట‌బోయే పోరాటంలో మ‌రిన్నీ పార్టీల‌ను భాగ‌స్వామ్యం చేసే దిశ‌గా ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికిపైగా ఎంపీల‌తో సంత‌కాలు చేయించి దానిని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఇవ్వ‌నుంది.

Advertisement

Advertisement

ఈ మేర‌కు మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్‌లో స‌మావేశ‌మై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీలో ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వివ‌రాలు వెల్ల‌డించారు. లాభాల్లో ఉన్న లాభాల్లోకి వ‌చ్చే అవ‌కాశ‌మున్నా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు త‌మ పార్టీ పూర్తిగా వ్య‌తిరేకం అని ఆయ‌న చెప్పారు.

ఈ విష‌యంలో అన్నీ పార్టీల‌ను క‌లుపుకుని పోతామ‌ని చెప్పిన ఆయ‌న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌కు వ్య‌తిరేకంగా 120 మంది ఎంపీల సంత‌కాలు సేక‌రించి ప్ర‌ధాన‌మంత్రికి నివేదిస్తామ‌ని వెల్ల‌డించారు.

Also Read : నాటో ప్ర‌య‌త్నాలు విర‌మిస్తాం.. ర‌ష్యాతో ఒప్పందానికి సిద్ధం : జెలెన్ స్కీ

Visitors Are Also Reading