Home » చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలి : వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలి : వైసీపీ ఎమ్మెల్యే

by Bunty
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ మేరకు బలమైన ఆధారాలు చూపించిన ఏపీ సిఐడి పోలీసులు…. చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేశారు. గత 22 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు.

ycp mla Nallapureddy Prasanna Kumar Reddy slams chandrababu naidu

ycp mla Nallapureddy Prasanna Kumar Reddy slams chandrababu naidu

అయితే చంద్రబాబు నాయుడు అరెస్టును కొంతమంది ఖండిస్తుంటే… కొంతమంది వైసిపి నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును నడిరోడ్డులో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి నేతల్లోనే సానుభూతి ఉందని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాక్యానించారు.

Advertisement

Advertisement

‘తప్పు చేశాడు కాబట్టే… చట్టం అరెస్టు చేసింది. రాజమండ్రి జైలులో చంద్రబాబును పెట్టారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన వ్యక్తి… ఎలాంటి చావు చస్తాడో కూడా చూస్తాం. చంద్రబాబుకు ఈ శిక్ష సరిపోదు. నడిరోడ్డుపై ఉరితీయాలి. అప్పుడే ప్రజలంతా సంతోషిస్తారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది’ అని అన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబు నాయుడును ఏపీ ప్రజలు ఎవరు ఇప్పుడు నమ్మడం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికలలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలకు ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసిపి గెలిచి చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.

 

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading