Home » సర్ఫరాజ్ తో టీమిండియాకి మరో స్టార్ దొరికినట్టేనా..?

సర్ఫరాజ్ తో టీమిండియాకి మరో స్టార్ దొరికినట్టేనా..?

by Anji
Ad

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగనున్న మూడో టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ తరువాత టీమిండియా పటిష్టంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరిగితే.. తొలి మ్యాచ్ ఆడిన సర్పరాజ్ ఖాన్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ తో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు అయిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే టెంపోను కొనసాగించి 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

Advertisement

తొలి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలతో రాణించి సూపర్ స్టార్ అందుకున్నాడు. సర్ఫరాజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు దేశవాళి క్రికెట్ లో చాలా అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్ జాతీయ జట్టులో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశాడు. ఏళ్ల నిరీక్షణ తరువాత ఎట్టకేలకు సర్ఫరాజ్ కు భారత జట్టులో చోటు దక్కింది. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా అందుకున్నాడు ఈ యువ క్రికెటర్. తొలి మ్యాచ్ ఆడుతున్న ఆటగాడికి ఇది చాలా మంచి ఆరంభం అనే చెప్పాలి.

Advertisement

తొలి ఇన్నింగ్స్ లో రనౌట్ కాకపోయి ఉంటే.. సర్ఫరాజ్ కచ్చితంగా సెంచరీ చేసేవాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో ఇంకా టైమ్ ఉంటే సెంచరీ మార్క్ అందుకునే వాడే. ఆడుతున్న విధానం చూస్తే.. రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం పెద్ద విషయం కాదు.. కానీ బ్యాడ్ లక్ తో తొలి ఇన్నింగ్స్ లో జడేజా తప్పిదం కారణంగా రనౌట్.. రెండో ఇన్నింగ్స్ డిక్లెర్ చేయడంతో నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 319 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 126 పరుగుల లీడ్ అందుకుంది. రెండో ఇన్నింగ్స్ లో ఆడి భారత్ ఏకంగా 430 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి చతికిల పడింది. 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Also Read :  ఇంగ్లండ్ పై టీమిండియా ఘనవిజయం.. WTC ఫైనల్ రేసు నుంచి ఇంగ్లీషు జట్టు ఔట్..!

Visitors Are Also Reading