ఒకప్పుడు సినిమాల్లో విలన్ పాత్రలు చేసేందుకు హీరోలు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్ పాత్రలు చేయడానికి హీరోలు ముందుకు వస్తున్నారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అర్జున్, జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు విలన్ పాత్రల్లో నటిస్తూ ఎంతో సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా హీరో పుచ్చుకునేంత రెమ్యునరేషన్ వీరు కూడా పుచ్చుకుంటున్నారు.
Mahesh Babu trivikram movie
కాగా ఇప్పుడు మరో తమిళ స్టార్ హీరో కూడా విలన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రకోసం సీనియర్ హీరోయిన్ శోభనను కూడా తీసుకున్నారని టాలీవుడ్ లో గుసగసులు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement
mahesh babu vikram
ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబుకు విలన్ గా చియాన్ విక్రమ్ నటించబోతున్నారని టాక్. ఈ సినిమాలో విలన్ గా విక్రమ్ అయితేనే సరిపోతారని…దాంతో ఆయనను ఒప్పించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.