Home » పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడం పై విజయశాంతి కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడం పై విజయశాంతి కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

తెలుగు రాష్ట్ర నేత, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించిన తరుణంలోనే అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా లేట్ గా అయినా.. ఆయనకు సముచిత గౌరవం లభించిది అని పలువురు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Advertisement

Advertisement

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పీవీకి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూనే ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ కి కూడా భారతరత్న అవార్డును ప్రకటించి ఉంటే యావత్ తెలుగు ప్రజానీకం మరింతగా పులకించిపోయేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసింది. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండకపోవచ్చు. కానీ తెలుగు జాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహారావు వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మ శ్రీ ఎన్టీఆర్ కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం.

 

ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లగలిగే అవకాశం ఈరోజు నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకొని అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అని విజయశాంతి రాసుకొచ్చారు.

 

Visitors Are Also Reading