Home » శ్రీలీల జాతకంలో సంచలన విషయాలు బయటపెట్టిన వేణుస్వామి..!

శ్రీలీల జాతకంలో సంచలన విషయాలు బయటపెట్టిన వేణుస్వామి..!

by Mounika
Ad

వేణుస్వామి.. ప్రస్తుతం మీ పేరు అందరికీ సుపరిచితమే. ఎప్పటి నుంచో సినిమా, రాజకీయ రంగాల వారికి జాతకాలు చెబుతూ వచ్చే వేణు స్వామి సమంత, హీరో నాగచైతన్య త్వరలో విడిపోబోతారు అంటూ జాతకం చెప్పి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇక ఆయన చెప్పినట్లుగానే నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోవడంతో ఆయన జోస్యం నిజం కావడంతో స్టార్ ఆస్ట్రాలజిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కొంత కాలం క్రితం  అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడు అని వేణు స్వామి చెప్పిన జోస్యం నిజమైంది.

Advertisement

ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి మూడేళ్ల క్రితం వేణు స్వామి చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. 2023 ఆగస్టు తర్వాత చంద్రబాబు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని వేణు స్వామి చెప్పడం జరిగింది. ఇక ఆయన చెప్పినట్లేగానే 2023 ఆగస్టు తర్వాత అనగా సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ఇప్పుడు వేణు స్వామి స్టార్ హీరోయిన్ శ్రీలీల  జాతకంలో సంచలన విషయాలు బయటపెట్టారు.

Advertisement

 

శ్రీకాంత్ తనయుడు రోషన్ తో కలిసి పెళ్లి సందడి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. మొదటి చిత్రం ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోయినా ఆ తర్వాత  రవితేజ తో కలిసిన నటించిన ధమాకా చిత్రంతో సూపర్ హిట్ నా అందుకొని వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. తాజాగా వేణుస్వామి ఆమె జాతకం ప్రకారం టాలీవుడ్‌లో ఆమెకు మరో ఐదేళ్లు తిరుగు ఉండదని తెలిపారు.

శ్రీలీలది మీనరాశి అని, ఆమె జాతకంలో రవి, గురు, శని, శుక్ర గ్రహాలు ఆధారంగా శ్రీలీల జాతకం విశ్లేషించి ఆమె జాతకంలో శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడని వేణుస్వామి తెలిపారు. శ్రీలీల జాతకంలో రవి, గురు, శని పదో స్థానంలో ఉండటం వలన ఆమెకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయని వెల్లడించారు. 2023 జూన్‌ నుంచి 2028 చివరి వరకు శ్రీలీలకు అనుకూలమైన ఫలితాలే వస్తాయని, టాలీవుడ్‌తోపాటు సౌత్‌ ఇండియాలోని రెండు మూడు భాషల్లో విపరీతమైన అవకాశాలు వస్తాయని వెల్లడించారు. జాతకరిత్యా అన్నీ గ్రహ స్థితులు కూడా శ్రీలీలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అలాగే 2024 తర్వాత కొంతమంది హీరోయిన్లులు తెరపై కనుమరుగవుతారనిి  వేణు స్వామి చెప్పటం గమణార్హం. ఆయన చెప్పిన అనేక విషయాలు నిజం కావడంతో.. ఈ నేపథ్యంలో త్వరలో సమంత, రష్మిక మందన, పూజాహెగ్డే తెరమరుగు అవ్వటం ఖాయం అనిపిస్తుంది. మరి 2024లో వేణుస్వామి చెప్పినట్లుగా నిజమవుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.

 

Visitors Are Also Reading