ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం నుండి సినిమా ఇండస్ట్రీకి చాలా తక్కువ మంది వచ్చారు. అలాంటి సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు వేణుమాధవ్. నల్లగొండ జిల్లా నుండి ఇండస్ట్రీకి వచ్చిన వేణుమాధవ్ సినిమాల్లో స్టార్ కామెడియన్ గా రాణించాడు. చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన వేణుమాధవ్ చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఒకప్పుడు వేణుమాధవ్ స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ నటించాడు.
Advertisement
కాగా ఓ ఇంటర్వ్యూలో వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో సావిత్రమ్మ మాట్లాడుతూ ….”నాకు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు జన్మించారు. వేణుమాధవ్ చిన్ననాటి నుండి చాలా చురుకుగా ఉండేవాడు. మిమిక్రీ బాగా చేసేవాడు. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయనను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు.
Advertisement
అలా మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వేణుమాధవ్ ఎప్పుడు జబ్బు చేసినా మందులు వేసుకునే అలవాటు ఉండేది కాదని అదే చివరికి కొంప ముంచిదని అన్నాడు. ఇక సినిమాల్లో వేణు మాధవ్ బిజీగా ఉండటం వల్ల నా ఇద్దరు కొడుకులను కూడా ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేర్పించాను, నేను చేసిన పెద్ద తప్పు అదే… వారిలో ఒక కుమారుడు కూతురు పెళ్లి టెన్షన్ వల్ల చనిపోయాడు.
ఇక నెల 15 రోజుల్లోనే వేణుమాధవ్ కూడా చనిపోయాడు. ఒక్కోసారి నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అని అనిపిస్తూ ఉంటుంది. వేణుమాధవ్ కు ఏడెనిమిది ఫ్లాట్ లు ఉన్నాయి. 20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. కానీ నేను మాత్రం మూడో కొడుకుని చూసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నాను. వేణుమాధవ్ బ్రతికి ఉంటే ఏమైనా ఇచ్చేవాడేమో….” అంటూ వేణుమాధవ్ తల్లి చెప్పుకొచ్చింది.
Also read :“పవన్ మీ బావనా” అంటూ నెటిజన్ కామెంట్….షాకింగ్ రిప్లై ఇచ్చిన శ్రీరెడ్డి..!