Home » చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిస్తే అధికారం కాదు అంద‌కార‌మే…! వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిస్తే అధికారం కాదు అంద‌కార‌మే…! వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

వేణు స్వామి ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌రచూ సెల‌బ్రెటీల జాత‌కాలు పొలిటిక‌ల్ లీడ‌ర్ల జాత‌కాలు ఎలా ఉన్నాయో చెబుతూ వేణు స్వామి వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారుతుంటారు. స‌మంత నాగ‌చైత‌న్య విడిపోతార‌ని వేణుస్వామి చెప్పారు. అలా వేణుస్వామి చెప్పిందే జ‌రిగింది. అంతే కాకుండా ర‌ష్మిక‌మంద‌న త‌ను పూజ‌లు చేసిన త‌ర‌వాత‌నే హీరోయిన్ గా సక్సెస్ అయ్యార‌ని వేణుస్వామి చెప్పుకుంటూ ఉంటారు.

Advertisement

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు రాజకీయ యోగం లేద‌ని ఆయ‌న రాజ‌కీయాల్లో రానించ‌లేర‌ని ప‌వ‌న్ గతంలో జోతిష్యం చెప్పిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఏపీలో చంద్ర‌బాబు ప‌వ‌న్ పొత్తుపై వేణుస్వామి జోతిష్యం చెప్పారు. రీసెంట్ గా ప‌వ‌న్ క‌ల్యాణ్ చంద్ర‌బాబు క‌లిసి మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. దాంతో వాళ్లిద్ద‌రూ రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

కాగా తాజాగా వేణుస్వామి చంద్ర‌బాబు ప‌వ‌న్ పొత్తు పై స్పందించారు. జ‌న‌సేన టీడీపీ బీజేపీ క‌లిసి ప‌నిచేస్తే సంచ‌ల‌నం న‌మోద‌వుతుంద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కింద చంద్ర‌బాబు, లోకేష్ ప‌నిచేస్తారా అని ప్ర‌శ్నించారు. వీళ్లు ఒకే స్టేజిపై క‌నిపిస్తే ప్ర‌పంచ వింతే అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చంద్ర‌బాబు సీఎం అభ్య‌ర్థిగా ఎన్నుకుంటే ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయ‌ని అన్నారు.

venu swami

venu swami

చంద్రబాబు గారిది పుష్య‌మి..ప‌వ‌న్ కల్యాణ్ ది ఉత్త‌ర ఆషాడ న‌క్ష‌త్రాలు ఈ రెండూ విరుద్దంగా ఉంటాయ‌ని అస్స‌లు ప‌డ‌వ‌ని అన్నారు. వీళ్లు దూరంగా ఉంటేనే బాగుంటారు ద‌గ్గ‌ర‌కొస్తే క‌ల‌వ‌రని చెప్పారు. జాత‌కం ప్ర‌కారం చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిస్తే అధికారం కాద‌ని అంద‌కారం అని అన్నారు. వీళ్లు క‌లిసినా వాళ్ల న‌క్ష‌త్రాలు క‌ల‌వ‌వ‌ని అది ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు అనుకూలంగా మారుతుంద‌ని వేణుస్వామి జోతిష్యం చెప్పారు.

Visitors Are Also Reading