ప్రముఖ ఆస్ట్రాలజిస్టు వేణు స్వామి… గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారిపోయారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ…. వివాదాలకు తెర లేపుతున్నారు వేణు స్వామి.మొన్నటి వరకు టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ కాలం గడిపారు వేణు స్వామి.
Advertisement
సమంత మరియు నాగచైతన్య ఎపిసోడ్, నయనతార పెళ్లి విషయం, రష్మిక కెరీర్ అలాగే తారకరత్న మృతి ఇలా ఎన్నో విషయాలను ఎగ్జాక్ట్గా అంచనా వేయగలిగారు వేణు స్వామి. ఇంకా ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై… వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం పనిచేయలేదు. దీంతో ఆయనను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్త సంవత్సరంలో వీడియోను షేర్ చేసుకున్నారు వేడు స్వామి.
2024 సంవత్సరం లేదా 2025 సంవత్సరంలో టాలీవుడ్కు చెందిన ఓ స్టార్ హీరో ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతాడని చెప్పుకొచ్చాడు. అతని అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు గుడ్ బై చెప్పి రెస్ట్ తీసుకుంటాడని వెల్లడించాడు వేణు స్వామి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఏదో బయటికి చెప్పని ఓ అనారోగ్యంతో ప్రభాస్ బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు కూడా తెలిపారు. వేణు స్వామి చెప్పినట్లుగానే ప్రభాస్ సినిమా కెరియర్ ముగుస్తుందని అతని ఫ్యాన్స్ భయపడుతున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!