Home » సంతోషం గా ఉండండి…మాజీ భర్త మరణం పై నటి సంచలన పోస్ట్….!

సంతోషం గా ఉండండి…మాజీ భర్త మరణం పై నటి సంచలన పోస్ట్….!

by AJAY
Ad

నటి వనిత విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్ కన్నుమూసారు. పీటర్ పాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా శనివారం చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Advertisement

మాజీ భర్తను తలుచుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వనిత….. సాయం చేసే వారికి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడని మా అమ్మ చెప్పింది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నప్పుడు ఎటు వైపు వెళ్లాలనేది ఎవరికి వారు నిర్ణయించుకుంటారు.

Advertisement

సుదీర్ఘ పోరాటం తర్వాత మీకు విముక్తి లభించింది. శాంతి లభించింది. అని భావిస్తున్నాను. నువ్వు ఈ లోకం నుండి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది. ఇప్పటికైనా నీకు ప్రశాంతత లభిస్తుంది అని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి. అంటూ వనిత విజయ్ కుమార్ తన పోస్ట్ లో పేర్కొంది. ఇదిలా ఉంటే వనిత విజయ్ కుమార్ 2020 లాక్ డౌన్ వేళ పీటర్ పాల్ ను వివాహం చేసుకుంది. అయితే అప్పటికే వనిత విజయ్ కుమార్ కు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది. కాగా పీటర్ ను మూడో పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా పీటర్ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

అయితే పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకున్నాడు అంటూ అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు వనిత విజయ్ కుమార్ తన భర్త తాగుబోతు అని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం వనిత విజయ్ కుమార్ తన పిల్లలతో సింగిల్ గా ఉంటుంది. మాజీ భర్త తో విడాకులు తీసుకున్నా అతడు కన్ను మూసిన తరవాత ఎమోషనల్ అయ్యింది.

Visitors Are Also Reading