మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. అంతకముందు బుచ్చిబాబు దర్శకుడు సుకుమార్ వద్ద శిష్యరికం చేశాడు. ఆ తరవాత సొంతంగా కథను రాసుకుని మెగాహీరోనే మెప్పించాడు. అలా వైష్ణవ్ తేజ్ బుచ్చిబాబు కాంబోలో ఉప్పెన సినిమా ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు విడుదలకు ముందే ఎంతో క్రేజ్ వచ్చింది.
Advertisement
దానికి కారణం ఈ సినిమా నుండి విడుదలైన పాటలు శ్రోతలకు ఎంతగానో నచ్చాయి. ఆడియో హిట్ అవ్వడంతో పాటూ సినిమా టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. అలా థియేటర్ లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మెల్లి మెల్లిగా బ్లాక్ బస్టర్ టాక్ ఈసినిమాకు వచ్చింది. దాంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్ లు కూడా వచ్చాయి.
Advertisement
కరోనా తరవాత ప్రేక్షకులు థియేటర్ లలో అడుగుపెట్టడానికి భయపడ్డారు. అలాంటిది ఉప్పెన సినిమాతో థియేటర్ లకు పూర్వ వైభవం వచ్చింది. ఈ సినిమా తరవాత మళ్లీ సినిమాలకు ప్రేక్షకులు వస్తారనే నమ్మకం కలిగింది. అయితే ఇంతటి విజయం సాధించిన సినిమాలో దర్శకుడు ఓ మిస్టేక్ చేశాడు.
సినిమాలో కృతిశెట్టి కాలేజీకి వెళ్లి బస్ లో వస్తున్న సమయంలో హీరో వైష్ణవ్ తేజ్ కొంతమందితో గొడవపడుతూ కనిపిస్తాడు. అక్కడే బస్ ఆగటంతో వైష్ణవ్ తేజ్ కూడా బస్ లోకి ఎక్కుతాడు. అయితే కాలేజీ బస్ వచ్చేటప్పుడు అందులో ఐదారుగురు మాత్రమే కనిపిస్తారు. కానీ బస్ ఎక్కిన తరవాత బస్ లోని అన్ని సీట్ లలో జనాలు కనిపిస్తారు. ఇక ఈ సీన్ నెటిజన్లు పసిగట్టడంతో ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేసావ్ డైరెక్టర్ అంటూ బుచ్చిబాబుపై ట్రోల్ చేస్తున్నారు.
ALSO READ :భూమా మౌనిక జీవితంలో ఇంత విషాదం ఉందా…మొదట తల్లి మూడు నెలలకే తండ్రి..!