Home » కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్లను చూశారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్లను చూశారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

by AJAY
Ad

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆక‌స్మిక మ‌ర‌ణం యావ‌త్ టాలీవుడ్ ను దిగ్బ్రాంతికి గురిచేసింది. కృష్ణంరాజు ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. వంద‌ల చిత్రాల‌తో ఆయ‌న తెలుగు చిత్ర‌సీమ‌లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్నారు. కేవ‌లం త‌న సినిమాల‌తోనే కాకుండా త‌న మంచి మ‌న‌సుతోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర‌వాత ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన చాలా మంది న‌టీన‌టులు ఆయ‌న చాలా గొప్ప‌వారు అని ఆయ‌ను గుర్తుచేసుకుంటున్నారు.

Advertisement

ఇక టాలీవుడ్ లో ఒక‌ప్పటి హీరోల వార‌సులు ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా కృష్ణం రాజు న‌ట‌వార‌సుడుగా రెబల్ స్టార్ ప్ర‌భాస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ప్ర‌భాస్ కృష్ణంరాజు సోద‌రుడి కుమారుడు…కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు ఉండ‌గా ప్ర‌భాస్ ను కృష్ణం రాజు సొంత కుమారుడిలా చూసుకుంటారు. ప్ర‌భాస్ కూడా త‌న పెద‌నాన్న కృష్ణంరాజుకు ఎంతో విలువ ఇస్తారు. ఇదిలా ఉండ‌గా కృష్ణం రాజు మ‌ర‌ణం త‌ర‌వాత చాలా మంది ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఏం చేస్తున్నారు.

Advertisement

అని తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.కృష్ణం రాజుకు ముగ్గురు కూతుళ్లు ఉండ‌గా అంద‌రూ చ‌దువుల‌తో బిజీగా ఉన్నారు. కృష్ణం రాజు పెద్ద కుమార్తె ప్ర‌సీద లండ‌న్ లో ఎంబీఏ పూర్తిచేసింది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాధేశ్యామ్ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించింది.

ఇక కృష్ణం రాజు రెండ‌వ కుమార్తె పేరు ప్ర‌కీర్తి కాగా హైద‌రాబాద్ లోని జేఎన్టీయూలో ఆర్టిటెక్చ‌ర్ కోర్స్ ను నేర్చుకుంటోంది. కృష్ణం రాజు మూడ‌వ కుమార్తె కూడా చ‌దువుకుంటోంది. ఇటీవ‌ల సైకాల‌జీలో డిగ్రీ పూర్తి చేసి ఉన్న‌త చ‌దువుల కోసం సిద్దం అవుతోంది. ఇప్పుడు కృష్ణం రాజు మ‌ర‌ణంతో ఆయ‌న కుటుంబంలో విషాదం నిండుకుంది. ప్ర‌భాస్ ఆ ఫ్యామిలీకి అండ‌గా ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading