Home » భారత్‌ మాతా కి జై అనడం లేదని కేంద్ర మంత్రి ఫైర్..!

భారత్‌ మాతా కి జై అనడం లేదని కేంద్ర మంత్రి ఫైర్..!

by Anji
Ad

తాను ప్రసంగం చేస్తున్న సభలోని వారు ”భారత్‌ మాతా కీ జై” అనలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి అసహనాన్ని వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఆమె కేరళలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో ఆమె కోజికోడ్‌ లో జరిగిన యువజన సదస్సులో పాల్గొన్నారు. ఆమె యువతను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రసంగం మొత్తం ముగిసిన తరువాత సభలోని వారందరూ కూడా ” భారత్‌ మాతా కీ జై” అన అనాలని తెలిపారు.

Advertisement

Advertisement

కానీ ఆమె అనుకున్నట్లు అక్కడ వారు భారత్ మాతా కీ జై అనే స్లోగన్ ఇవ్వలేదు. దీంతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారు. దీంతో దేశం పట్ల గౌరవం లేని వారు ఈ సభలో ఉండాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ మహిళను ఆమె భారత్‌ మాతా మీ తల్లి కాదా అని ప్రశ్నించగా..? ఆమె ఏమి సమాధానం చెప్పలేదు. దీంతో ఆమెను సభ నుంచి బయటకు వెళ్లిపోమ్మని గట్టిగా అన్నారు. దేశం గురించి గర్వంగా చెప్పుకోలేని వారు ఈ సభలో ఉండాల్సిన అవసరం లేదని మంత్రి  పేర్కొన్నారు.  కేంద్ర మంత్రి అన్న మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.  ఆమెకు కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరికొంత మంది మాత్రం ఆమెను వ్యతిరేకిస్తున్నారు.

Visitors Are Also Reading