Home » Venu Swamy : సీఎం కేసీఆర్‌ ఓటమి.. వేణు స్వామిపై దారుణంగా ట్రోలింగ్‌ !

Venu Swamy : సీఎం కేసీఆర్‌ ఓటమి.. వేణు స్వామిపై దారుణంగా ట్రోలింగ్‌ !

by Bunty
Ad

Venu Swamy : జ్యోతిష్యులు వేణు స్వామి పై తెలుగు ప్రజలు ట్రోలింగ్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 అసెంబ్లీ సీట్లలో… కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 సీట్లను గెలుచుకుంది. ఇందులో ఒక కమ్యూనిస్టు సీటు కూడా ఉండటం గమనార్హం. అటు భారత రాష్ట్ర సమితి పార్టీ 39 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిలిచింది.

Advertisement

ఇక ఇలాంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన జ్యోతిష్యులు వేణు స్వామి పై తెలుగు ప్రజలు ట్రోలింగ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఆయన ఇటీవల జ్యోతిష్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని… ఒకవేళ ఆయన సీఎం కాకపోతే జ్యోతిషాన్ని వదిలేస్తానని ప్రకటించారు వేణు స్వామి. కానీ నిన్న విడుదలైన ఎన్నికల ఫలితాలలో సీఎం కేసీఆర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

కేవలం భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల జ్యోతిష్యులు వేణు స్వామి పై తెలుగు ప్రజలు ట్రోలింగ్ చేస్తున్నారు. నువ్వు చెప్పినట్లు సీఎం కేసీఆర్‌ మూడోసారి గెలవలేదు. బీఆర్ఎస్‌ పార్టీ ఓటమి చెందింది…ఇక ఇప్పుడు నువ్వు జ్యోతిష్యం మానేయ్‌ అంటూ జ్యోతిష్యులు వేణు స్వామి పై తెలుగు ప్రజలు ఫైర్‌ అవుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading