Home » ‘విశ్వంభర’ లో డబుల్ రోల్ లో నటించనున్న త్రిష..?

‘విశ్వంభర’ లో డబుల్ రోల్ లో నటించనున్న త్రిష..?

by Anji
Ad

వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి కాస్త గ్యాప్‌ తీసుకుని మొదలు పెట్టిన చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. దానికి తగ్గట్టే ఈ మూవీ మీద చాలా హైప్స్ కూడా ఉన్నాయి. విశ్వంభర షూటింగ్ కూడా ప్రారంభం అయింది. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తో సినిమాను రూపొందిస్తున్నారు. చాలా కాలంత ర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది.

Advertisement

Advertisement

ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. విశ్వంభర మూవీలో త్రిష హీరోయిస్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం త్రిష ఇందులో డబుల్ రోల్‌లో నటిస్తోంది అని చెబుతున్నారు. అంతేకాదు రెండు పాత్రలో మూవీలో చాలా కీలకం అని కూడా చెబుతున్నారు. చాలా ఏళ్ళ తరువాత చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్నారు. చిరంజీవితో ఒకసారి సినిమా చేయడమంటేనే చాలా గొప్ప. అలాంటిది త్రిష రెండోసారి అవకాశం దక్కించుకుంది. అది కూడా డబుల్ రోల్ అంటే మామూలు విషయం కాదని అంటున్నారు మెగాఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో చిరంజీవి, త్రిష తో పాటు సురభి, రమ్య, ఇషా చావ్లా, అశ్రిత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

Also Read :  లోక్‌సభ ఎన్నికల బరిలో టాలీవుడ్‌ హీరోయిన్‌.. బెంగాల్‌ నుంచి బరిలోకి..!

Visitors Are Also Reading