Home » గొంతుపై మానని గాయాలు.. సాయి ధరమ్ తేజ్ ఇంకా బాధ పడుతున్నారా?

గొంతుపై మానని గాయాలు.. సాయి ధరమ్ తేజ్ ఇంకా బాధ పడుతున్నారా?

by Bunty
Ad

మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. 2014 సంవత్సరంలో “పిల్ల నువ్వు లేని జీవితం” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా అనంతరం వరుసగా ఎన్నో చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే అతడు కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కోమా వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. తన అభిమానుల కోసం చాలా వేగంగా కోలుకొని మళ్ళీ సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

విరూపాక్ష సినిమాతో మళ్లీ అభిమానులను అలరించాడు. ఈ సినిమాతో దాదాపు రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఈ సినిమా అనంతరం మళ్లీ సాయిధరమ్ తేజ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సాయిధరమ్ తేజ్. ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్ ని పోయిన సంవత్సరం మీకు ఎలా కలిసివచ్చిందని అడగ్గా…. విరూపాక్ష సినిమా మంచి సక్సెస్ ని ఇచ్చింది. కానీ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ కన్నా నేను ఆస్పత్రిలో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నప్పుడు అభిమానులు నాకోసం ప్రార్ధించిన విధానం, ప్రతి ఒక్కరు నామీద ప్రేమను చూపించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

వారి ప్రేమ, అభిమానాన్ని పొందడం నాకెంతో అదృష్టం. వారి ప్రేమను చూసి నాకు ఎంతో సంతోషం కలిగిందని చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో సాయిధరమ్ తేజ్ గొంతు దగ్గర లోతైన గాయపు గుర్తులు స్పష్టంగా కనిపించాయి. అది చూసి చాలామంది షాక్ అవుతున్నారు. గొంతు దగ్గర చాలా డీప్ గా కట్ ఉంది. అందువల్లేనేమో సాయిధరమ్ తేజ్ మాట్లాడడానికి కాస్త తడబడుతున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనాప్పటికీ సాయిధరమ్ తేజ్ మళ్ళీ సినిమాల్లో నటించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading