తెలుగు చిత్రసీమలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన నటీనటులే ఉంటారు. దర్శకనిర్మాతలు కూడా ఏపీ నుండి వచ్చినవాళ్లే కనిపిస్తారు. కానీ టాలీవుడ్ లో తెలంగాణ నుండి వచ్చినవాళ్లను వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు.
Advertisement
అయితే తెలంగాణలో ఒకే జిల్లానుండి వచ్చినవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఆ జిల్లా పేరు నిజామాబాద్…దిల్ రాజు ఈ జిల్లకే చెందినవారని చాలా మందికి తెలుసు. అంతే కాకుండా హీరో నితిన్ సొంత జిల్లా కూడా నిజామాబాద్ అన్న విషయం చాలా మందికి తెలియదు.
Also Read: ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా?
నితిన్ తండ్రి నిజామాబాద్ నుండి వచ్చి నిర్మాతగా ఎదిగారు. యాంకర్ శ్రీముఖి సైతం నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ నిజామాబాద్ లోనే ఉంటున్నారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా నిజామాబాద్ లోని కామారెడ్డిలో జన్మించాడు.
Advertisement
ఆ తరవాత విదేశాల్లో ఉద్యోగం చేసి సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ నటి అదితిమ్యాక్యాల్ కూడా కామారెడ్డికి చెందినవారు. అదితి తండ్రి హైదరబాద్ లోని ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ కాగా అదితి నటన పై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Also Read: ప్రత్యూష మరణం తరవాత ప్రెస్ మీట్ లో ఆమె తల్లిని తిట్టిన మోహన్ బాబు..? అలా ఎందుకు చేశారంటే..!
జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ చమ్మక్ చంద్ర కూడా నిజామాబాద్ పట్టణానికి చెందినవారే. ప్రస్తుతం చంద్ర సినిమాలతో పాటూ టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా యాంకర్ శివజ్యోతి సైతం నిజామాబాద్ జిల్లాకు చెందినవారే. నిజామాబాద్ లోనే శివజ్యోతి పుట్టిపెరగటంతో పాటూ అక్కడే చదువుకున్నారు. ఇక ప్రస్తుతం పలు టీవీ షోలతో శివజ్యోతి బిజీగా ఉంది.
Also Read: రజినీకాంత్ ‘శివాజీ’ సినిమాలో దర్శకుడు శంకర్ చేసిన మిస్టేక్ ఇదే..!