Home » తార‌క‌ర‌త్న పాన్ ఇండియా సినిమాను మిస్ చేసుకున్నాడ‌ని తెలుసా..? ఆ సినిమా ఏదంటే…?

తార‌క‌ర‌త్న పాన్ ఇండియా సినిమాను మిస్ చేసుకున్నాడ‌ని తెలుసా..? ఆ సినిమా ఏదంటే…?

by AJAY
Ad

టాలీవుడ్ హీరో తార‌క‌ర‌త్న మ‌ర‌ణ‌వార్త ఇండ‌స్ట్రీలో విషాదాన్ని నింపిన సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి అభిమానులు ఇంకా ఆ షాక్ లోనే ఉండిపోయారు. తార‌క‌ర‌త్న మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. తార‌క‌ర‌త్న నంద‌మూరి వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

ఒక‌టో నెంబ‌ర్ కుర్రాడు సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అంతే కాకుండా మొద‌టి సినిమాతోనే తార‌క‌ర‌త్న హిట్ కూడా కొట్టాడు. ఆ త‌ర‌వాత తార‌క‌ర‌త్న చాలా సినిమాలు చేశాడు కానీ స‌రైన హిట్ ప‌డ‌లేదు. దాంతో విల‌న్ గానూ న‌టించాడు. అమ‌రావ‌తి సినిమాలో విల‌న్ గా అద‌ర‌గొట్టాడు. ఇక తార‌క‌ర‌త్న కు సినిమా ఛాన్స్ లు రాక‌పోవ‌డానికి ఫ్యామిలీ స‌పోర్ట్ కూడా లేక‌పోవ‌డం కార‌ణం అయ్యింద‌ని టాక్ ఉంది. తార‌క‌ర‌త్న ప్రేమ‌వివాహం చేసుకోవడంతో ఆ వివాహం ఇష్టం లేని ఫ్యామిలీ ఆయ‌న‌ను దూరం పెట్టింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే స‌రైన అవ‌కాశాలు రాలేద‌ని టాక్ ఉంది. కానీ కొంత‌కాలంగా తార‌క‌ర‌త్న ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌య్యాడు.

 

Advertisement

అంతే కాకుండా రాజ‌కీయాల్లోనూ చురుకుగా వ్య‌వ‌హరించాడు. ఇదిలా ఉంటే తార‌క‌ర‌త్న కు ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ అవ‌కాశం వ‌చ్చేద‌ట‌. కానీ ఇంత‌లోనే తార‌క‌ర‌త్న క‌న్నుమూయ‌డం బాధ‌క‌రం. ఆ ఆఫ‌ర్ కూడా ప్ర‌భాస్ సినిమాలో కావ‌డం విశేషం. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంది.

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో తార‌క‌ర‌త్న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావించార‌ట‌. ఈ విష‌యాన్ని నిర్మాత అశ్వినిద‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో వెళ్ల‌డించారు. ప్రాజెక్ట్ కే లో ఓ మంచి రోల్ తార‌క‌ర‌త్న‌కు ఇవ్వాల‌ని తాను నాగ్ అశ్విన్ అనుకున్నామ‌ని చెప్పారు. కొద్దిరోజుల్లో తార‌క‌ర‌త్న‌కు ఈ విష‌యం చెప్పాల‌ని అనుకున్నామ‌న్నారు. కానీ ఇప్పుడు తార‌క‌ర‌త్న మ‌న మ‌ధ్య‌న లేడు అనే చేదు నిజం వినాల్సివ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ALSO READ :తారకరత్న మృతి చెందిన 2 రోజులకే.. ఆయన భార్య సంచలన నిర్ణయం !

Visitors Are Also Reading