నందమూరి హీరో తారకరత్న నిన్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో శుక్రవారం తారకరత్న పాల్గొన్నారు. లక్ష్మీపురం వరదరాజ స్వామి గుడిలో నారా లోకేష్ తో కలిసి తారకరత్న కూడా పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ కార్యకర్తలు, ప్రజలతో కలిసి తారకరత్న నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలారు.
read also : వెంకటేష్ కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా?
Advertisement
వెంటనే కార్యకర్తలు, సిబ్బంది తారకరత్నను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బెంగుళూరు నుండి వచ్చిన వైద్యబృందం ఆధునిక పరికరాలతో తారకరత్నకు చికిత్స అందించింది. అనంతరం తారకరత్నను బెంగుళూరుకు తరలించారు. ఇక తాజాగా తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.
Advertisement
ప్రత్యేక వైద్య బృందంతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు వచ్చింది. బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్న హెల్త్ కండిషన్ పై మెడికల్ రిపోర్ట్ విడుదల చేశారు. ఇందులో అత్యంత విషమ పరిస్థితుల్లో తారకరత్న ఆరోగ్యం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ మీద బెలున్ యాంజియో ప్లాస్టిక్ విధానంలో రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అంతేకాదు, మెలేనా అనే వ్యాధి ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. కాగా ఇవాళ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు బయలుదేరారు.
Jr NTR @tarak9999 & @NANDAMURIKALYAN Families Off to Bangalore. #TarakaRatnapic.twitter.com/iydIrcJ2Jg
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 29, 2023
read also : వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టిన నాగార్జున.. ఆ సినిమా ఏదంటే?