కొన్ని సినిమాలు మొదట ఒక హీరో వద్దకు వెళ్ళగా… ఆ హీరో మిస్ చేసుకుంటే మరో హీరో వద్దకు వెళతాయి. అలా టాలీవుడ్… బాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లోనూ చాలా సినిమాలు ఉన్నాయి. అలా తమిళ స్టార్స్ మిస్ చేసుకున్న 12 సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….అర్జున్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన ముధల్ వన్ సినిమా మొదట హీరో రజనీకాంత్ వద్దకు వెళ్ళింది. కానీ రజినీ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత విజయ్, కమల్ హాసన్ వద్దకు వెళ్లగా వాళ్ళిద్దరూ కూడా రిజెక్ట్ చేశారు. తమిళ సూపర్ హిట్ సినిమా కో… మొదటగా శింబు వద్దకు వెళ్ళింది. కానీ శింబు రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా హీరో జీవా చేతికి వెళ్ళింది.
Also Read: Popular Telugu Anchors: తెలుగులో మేల్ యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా ?
Advertisement
రోబో సినిమా కు శంకర్ మొదట కమలహాసన్ ను అనుకున్నారు. కానీ కమల్ హాసన్ ఈ సినిమాను మిస్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ప్రీతిజింతా మిస్ చేసుకుంది. తమిళంలో సూర్య జ్యోతిక జంటగా నటించిన ఖాకా ఖాకా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాను హీరో విక్రమ్ మరియు అజిత్ లు రిజక్ట్ చేశారు.
Advertisement
శంకర్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా గజిని మొదటగా హీరో అజిత్ మరియు మాధవన్ ల వద్దకు వెళ్ళింది. కానీ ఆ ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేయడంతో గజిని ఆఫర్ సూర్య వద్దకు చేరుకుంది. బాల దర్శకత్వంలో ఆర్య హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నాన్ కడవుల్ మొదట అజిత్ వద్దకు వెళ్ళింది. కానీ అజిత్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆఫర్ ఆర్యకు వచ్చింది. విక్రమ్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ధ్రువ నక్షత్రం ఆఫర్ మొదట సూర్య వద్దకు వెళ్ళింది. కానీ సూర్య వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను మిస్ చేసుకున్నారు. తమిళ బ్లాక్ బస్టర్ సినిమా బొంబాయి కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆఫర్ మొదట విక్రమ్ వద్దకు వెళ్ళింది. కానీ విక్రమ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. విశాల్ హీరోగా నటించిన పందెంకోడి సినిమా ఆఫర్ మొదటగా హీరో విజయ్ వద్దకు వెళ్ళింది. కానీ విజయ్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమా జెంటిల్మెన్ మొదటగా కమల్ హాసన్ వద్దకు వెళ్ళింది. కానీ కమల్ హాసన్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ అర్జున్ చేతికి వచ్చింది.
శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు సినిమా ఆఫర్ మొదట రజనీకాంత్ వద్దకు వెళ్ళింది. కానీ రజనీకాంత్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో కమల్ హాసన్ హీరోగా నటించగా బ్లాక్ బస్టర్ అయ్యింది. విక్రమ్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా స్వామి అక్కడ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఆఫర్ మొదట అజిత్ వద్దకు వెళ్ళగా ఆయన రిజెక్ట్ చేశాడు.