Home » గోవాలో టాలీవుడ్ పరువు తీసిన సురేష్ కొండేటి?

గోవాలో టాలీవుడ్ పరువు తీసిన సురేష్ కొండేటి?

by Bunty
Ad

సురేష్ కొండేటి ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఇతని పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సెలబ్రిటీలను చిత్రవిచిత్రంగా ప్రశ్నలు అడుగుతూ ఆయన ఓ సెలబ్రిటీ అవుతున్నాడు. సురేష్ కొండేటి చాలా కాలం నుంచి సంతోషం అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా ఈ కార్యక్రమాన్ని గోవాలో ఏర్పాటుచేశాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలామందిని ఈ కార్యక్రమానికి తీసుకెళ్లాడు సురేష్ కొండేటి. కానీ ఈ ఫంక్షన్ లో కాస్త గందరగోళం జరగడంతో టాలీవుడ్ పరువు పోయే పరిస్థితి ఏర్పడిందట.

Advertisement

ఈ కార్యక్రమంలో కన్నడ నటీనటులకు చేదు అనుభవం ఎదురైందట. స్టేజ్ మీద కన్నడ నటులకు అవార్డ్స్ ఇస్తున్న సమయంలో లైట్స్ ని ఆఫ్ చేసి అవమానానికి గురి చేశారని… అంతేకాకుండా హోటల్ సిబ్బందితో కూడా కాస్త ఇబ్బంది ఎదురైందని….. సంతోషం అవార్డ్స్ వేడుక మీద కన్నడ నటులు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను తప్పుపడుతున్నారు. అవార్డ్ ఫంక్షన్ జరుగుతున్న సమయంలోనే యాంకర్ మధ్యలోనే వెళ్లిపోయిందని, సరైన ఏర్పాటు ఏమీ చేయకుండా మమ్మల్ని అవమానించారని కన్నడ నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక జర్నలిస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు.

ఈసారి గోవాలో చేశాడు కానీ ఏవో కొన్ని కారణాలవల్ల ఫెయిల్ అయ్యాడు. ఆ ఫంక్షన్ కి వెళ్ళిన వారందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందులో వేరే పరిశ్రమకు చెందినవారు కూడా ఉన్నారు. వారు తెలుగు సినీ ఇండస్ట్రీని నిందిస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఒక్కరు చేసిన తప్పుకి ఇండస్ట్రీ మొత్తాన్ని అనడం సరికాదు. అంతేకాకుండా మీడియా వారు అతడు మా కుటుంబానికి చెందిన వ్యక్తి అని, పిఆర్ఓ అని రాస్తున్నారు. అతనికి, మా కుటుంబానికి ఎలాంటి పిఆర్ఓ కాదు. మా కుటుంబానికి చెందిన పిఆర్ఓ అసలే కాదు. అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading