Home » నీకు దండం పెడతా… వైయస్ షర్మిల డైలాగ్ తో రీల్ చేసిన సురేఖ వాణి..!

నీకు దండం పెడతా… వైయస్ షర్మిల డైలాగ్ తో రీల్ చేసిన సురేఖ వాణి..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేరణ చేయాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాలుగా సురేఖ వాణి ఎన్నో సినిమాల్లో అమ్మ, అత్త, అక్క, వదిన ఇలా హోమ్లీ క్యారెక్టర్స్‌ చేస్తు.. మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇలా ఇప్పటికే కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న సురేఖ వాణి ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు.

Advertisement

కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం తన కూతురు సుప్రిత తో అనేక వీడియోలు చేస్తూ వాటిని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సురేఖ వాణి… వైయస్ షర్మిల చెప్పిన డైలాగును రిల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

Advertisement

ఈ మధ్యకాలంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై చాలా దీటుగా స్పందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో షర్మిల మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో “స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వారు యువత కాబట్టి” అనే డైలాగ్ కూడా బాగా వైరల్ అవుతుంది.

 

తాజాగా సురేఖ వాణి ఇదే డైలాగ్ తో డిజె టిల్లు మూవీ డైలాగ్ ను ఆడ్ చేసి ఒక రీల్ చేసింది. అందులో సురేఖ వాణి … స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నావు అంటే వాళ్లు యువత కాబట్టి… నీకు దండం పెడతా నేను … నువ్వు ఎంత తక్కువ పాజిబుల్‌ అయితే అంతనే మాట్లాడు రాధిక… ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ ఏంగ్జయిటీ వస్తుంది నాకు… నువ్వు మాట్లాడుతుంటే అంటూ చెప్పిన డైలాగ్‌తో రీల్ చేసింది. సురేఖ వాణి చేసిన ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading