Home » భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి

భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి

by Anji
Published: Last Updated on
Ad

నటి సురేఖ వాణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమ్మ, చెల్లి, అక్క, అత్త ఇలా ఏ పాత్రలోనైన ఒదిగిపోయే కొంత మంది నటుల్లో సురేఖ ఒకరు. ఇటు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ గా కనిపించే ఈమె.. లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తనంత కూతురు ఉన్నప్పటికీ యంగ్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటారు.

Advertisement

Advertisement

అయితే ఎల్లప్పుడూ నవ్వుతూ అలరించే సురేఖ వాణి.. ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తన భర్తను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భర్త సురేష్ తేజను  గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడారు.. “మేమిద్దరం ఇష్టపడి వివాహం చేసుకున్నాము. సురేష్ నాకెంతో గౌరవం ఇచ్చారు. దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తే.. ఆయనతో నా భాదను మొత్తం పంచుకోవాలని ఉంది. తనకు క్షమాపణలు చెప్పాలి. ఈ భాద ఎప్పటికీ పోదు.. ఆయన ఇప్పటికీ నాతోనే ఉన్నారని నమ్ముతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు”. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై కూడా ఆమె స్పందించారు.

సోషల్ మీడియాలో కామెంట్స్ చూసి మొదట్లో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడం మంచిదని భావించాను. నా కూతురు సుప్రితకు కూడా ఇదే చెబుతుంటాను. ఇప్పుడు ఎవరైనా కామెంట్స్ చేసిన లెక్క చేయను అని అన్నారు. నటి సురేఖ వాణి  భర్త సురేష్ తేజ పలు టీవీ సీరియల్స్ కు దర్శకుడిగా వ్యవహరించారు. నాలుగేళ్ల క్రితం పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు.

Also Read :  మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్ వీరే..!

Visitors Are Also Reading