Home » త‌ర్వాతి సినిమాకు రెడీ అవుతున్న సుప్రీం హీరో.. డైరెక్ట‌ర్ సంప‌త్ నంది?

త‌ర్వాతి సినిమాకు రెడీ అవుతున్న సుప్రీం హీరో.. డైరెక్ట‌ర్ సంప‌త్ నంది?

by Bunty
Ad

సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ జ‌రిగిన త‌ర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. రిప‌బ్లిక్ సినిమా విడుద‌ల అయి తెలుగు ప్రేక్షులను అల‌రించిన సాయి ధ‌ర‌మ్ తేజ్.. ప్ర‌స్తుతం యాక్సిడెంట్ త‌ర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే సాయి ధ‌ర‌మ్ తేజ్ కు తీవ్ర గాయాలు కావడం తో రిప‌బ్లిక్ సినిమా త‌ర్వాత కొత్త సినిమాలు తీయ‌డానికి ముందుకు రాలేడు. ఒక వేళ సాయి ధ‌ర‌మ్ తేజ్ కు బైక్ ప్ర‌మాదం జ‌ర‌గ‌క పోతే.. ప్ర‌స్తుతం ఒక థ్రిల్ల‌ర్ సినిమా షూటింగ్ లో పాల్గొనే వాడు. ఈ థ్రిల్ల‌ర్ సినిమా కు స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు కొత్త గా డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం అవుతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

Advertisement

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే.. సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రో సినిమా కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంప‌త్ నందితో సూప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఒక‌ సినిమా తీయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమా కు మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంద‌ని తెలుస్తుంది. కాగ సంప‌త్ నంది ఇటీవ‌ల గోపీచంద్ తో సీటీమార్ సినిమా ను తెర‌కెక్కించాడు. ఈ సీటిమార్ సినిమా మంచి హిట్ అందుకుంది. అదే ఊపు తో సంప‌త్ నంది సాయి ధ‌ర‌మ్ తేజ్ తో మంచి హిట్ క‌థ తో సినిమా చేయ‌నున్నాడని స‌మాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌నను త్వ‌ర‌లోనే చేయ‌నున్నార‌ని తెలుస్తుంది.

Visitors Are Also Reading