Home » చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లు ఎక్కిన సుమంత్…!

చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లు ఎక్కిన సుమంత్…!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో సుమంత్ కోర్టు మెట్లు ఎక్కారు. సుమంత్ తో పాటు నిర్మాత సుప్రియ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఇద్దరూ మార్కాపురం కోర్టులో హాజరయ్యారు. సుమంత్ గతంలో బాలీవుడ్ సినిమా విక్కీ డోనర్ ను తెలుగు లో నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ సినిమాకు మార్కాపురం కు చెందిన కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫైనాన్స్ స్పందించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నిర్మాతలు తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని శ్రీనివాస్ రావు కేసు పెట్టారు.

Advertisement

Hero sumanth

Hero sumanth

అప్పటినుండి ఈ కేసు వాయిదాలు పడుతూనే ఉంది. కొంతకాలం కరోనా కారణం గా వాయిదా పడింది. ఇక ఇప్పుడు మళ్లీ కేసు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సుమంత్ మరియు నిర్మాత సుప్రియ మార్కాపురం కోర్టులో హాజరయ్యారు. అయితే కోర్టు తీర్పు ఇచ్చిందా లేదంటే మళ్లీ వాయిదా పడిందా విషయం మాత్రం తెలియాల్సి ఉంది. హీరో సుమంత్ మార్కాపురానికి వచ్చిన విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫోటో దిగేందుకు ఎగబడ్డారు.

Advertisement

 

ఇదిలా ఉండగా సుమంత్ కెరీర్ మొదట్లో గోదావరి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. కానీ కుటుంబ కారణాల వల్ల…ఇతర కారణాల వరుస సినిమాలు చేయలేకపోవడం తో హీరోగా కాస్త వెనుకబడ్డారు. ఇక ప్రస్తుతం సుమంత్ “మళ్ళీ మొదలైంది” అనే సినిమాలో నటిస్తున్నారు. సుమంత్ చివరగా నటించిన “మళ్ళీరావా” చిత్రం మంచి విజయం సాధించింది. దాంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

Visitors Are Also Reading