Home » రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంట తడి పెట్టుకున్న శ్రీదేవి ఎందుకు ? అసలు కారణం ఏంటంటే

రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంట తడి పెట్టుకున్న శ్రీదేవి ఎందుకు ? అసలు కారణం ఏంటంటే

by Anji
Ad

హీరోయిన్ శ్రీదేవి ఆలిండియా స్టార్ గా ఎంత పాపులర్ అయిందో దాదాపు అందరికీ తెలిసిందే. అధిక భాషల్లో లెక్కకు మించిన సినిమాలను చేసి దేశవ్యాప్తంగా గ్లామర్ హీరోయిన్ కి నిర్వచనంగా నిలిచారు శ్రీదేవి. రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంటతడి పెట్టుకుంది.  బాహుబలి2 విడుదల అయిన తరువాత రాజమౌళి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీదేవి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ssrajamoili-sridevi

Advertisement

 

ముఖ్యంగా బాహుబలి మూవీలో శివగామి క్యారెక్టర్ కోసం తొలుత శ్రీదేవిని అనుకున్నామని.. ఆమె ఒప్పుకోకపోవడమే మాకు కలిసి వచ్చిందని చెప్పాడు. ఆమె ఎందుకు ఒప్పుకోలేదో కూడా చెప్పాడు. రెమ్యునరేషన్ రూ.8కోట్లు డిమాండ్ చేసిందని.. 10 ఫ్లైట్ టికెట్స్ కావాలని.. తన కోసం హోటల్ లోని ఒక ఫ్లోర్ మొత్తం తీసుకోవాలని, ఈ సినిమా హిందీ వెర్షన్ లాభాల్లో వాటా అడిగిందని అందుకే శ్రీదేవిని తీసుకోలేదని చెప్పాడు రాజమౌళి. శ్రీదేవి క్యారెక్టర్ ని రమ్యకృష్ణ చేశారు. శివగామిగా బాహుబలిలో రమ్యకృష్ణ నటన అద్భుతమనే చెప్పాలి.   ఓ ఇంటర్వ్యూలో  రాజమౌళి వ్యాఖ్యలపై  స్పందించింది శ్రీదేవి. అంతేకాదు.. కంటతడి కూడా పెట్టింది.  “నేనెప్పుడు దీని గురించి మాట్లాడలేదు. నేను కొన్ని కారణాల వల్ల చాలా సినిమాలు చేయలేకపోయాను. అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి కూడా.

Advertisement

 

ఆ సినిమాలు చేయాలని నాకు రాసిపెట్టి లేదు అనుకునే దానిని తప్ప మరోలా బాధపడే దానిని కాదు.  బాహుబలి మూవీలో నేను ఆ క్యారెక్టర్ చేయలేదు. దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి ఏ ఇంటర్వ్యూలో నేను మాట్లాడలేదు. అసలు మాట్లాడకూడదనే అనుకున్నాను. రాజమౌళి గారు చెప్పింత అన్యాయంగా నేను డిమాండ్ చేసి ఉంటే.. 50 ఏళ్లలో 300కి పైగా సినిమాలు చేసి ఉండేదానినా..? నన్ను ఎప్పుడో ప్యాక్ చేసి పంపించేవారు. ఈ మిస్ అడర్ స్టాండింగ్ ఎక్కడ జరిగిందో తెలియదు” అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. నా కెరీర్ లో నా గురించి నెగిటివ్ గా మాట్లాడింది కేవలం రాజమౌళి గారే అని కంటతడి పెట్టింది శ్రీదేవి.

Also Read :  నువ్వు హీరోగా పనికిరావంటూ కృష్ణకు అవమానాలు…దాంతో ఆయన తమ్ముడు ఏం చేశారంటే ..?

Visitors Are Also Reading