Home » Sridevi: శ్రీదేవి మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇదే.. గతంలో ఒకసారి కూడా..!

Sridevi: శ్రీదేవి మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇదే.. గతంలో ఒకసారి కూడా..!

by Sravya
Ad

Sridevi :నటి శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శ్రీదేవి హఠాన్మరణం తో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణం అనేది ఇప్పటికీ మిస్టేక్ గానే ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలో శ్రీదేవి ఒక సంచలనాన్ని సృష్టించింది. సౌత్ లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత నార్త్ లో కూడా శ్రీదేవి ఒక వెలుగు వెలిగింది. కోట్ల మంది అభిమానుల హృదయాలను గెల్చుకుంది. ఎంతోమంది మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేసింది శ్రీదేవి. శ్రీదేవి కనుమూసే వరకు కూడా ఆమె సినిమానే ప్రపంచంగా భావించి బతికింది. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేసింది.

Advertisement

2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ప్రమాదవశాత్తు ఆమె చనిపోయారు. ఒక వేడుకలో పాల్గొనడానికి ఫ్యామిలీతో పాటుగా దుబాయ్ వెళ్లింది శ్రీదేవి హోటల్ గదిలో విగత జీవిగా కనబడింది ఊపిరి ఆడకుండా చనిపోయింది. శ్రీదేవి భర్త బోని కపూర్ కూడా ఇదే చెప్పారు. ఆమె కఠినమైన ఆహార నియమాలు పాటించేది అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేది. బాత్ టబ్ లో పడిపోయిన శ్రీదేవి ఊపిరి ఆడక చనిపోయిందని ఆయన చెప్పారు. శ్రీదేవికి జలగండం కూడా ఉంది. అదే ఆమె ఊపిరి తీసిందనే వాదన కూడా వచ్చింది.

Advertisement

గతంలో ఒక సంఘటన జరిగింది. 1972లో విడుదలైన బాలభారతం మూవీలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ కింద నటించింది. కౌరవులు పాండవులు పాత్రలు లో ఆమె పోషించింది బాలభారతం షూటింగ్ తమిళనాడు రాష్ట్రంలో వాటర్ ఫాల్స్ దగ్గర జరిగింది. గ్యాప్ లో చైల్డ్ ఆర్టిస్టులు ఆ వాటర్ ఫాల్స్ లో మునిగే వారు. శ్రీదేవి ఒక రాడ్ ని పట్టుకుని వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తూ ఉందట ఆ పక్కన ధర్మరాజు అర్జునుడు పాత్ర పోషించిన ఇద్దరు కుర్రాళ్ళు కూడా స్నానం చేస్తున్నారు శ్రీదేవి జారీ కొట్టుకుపోయారు పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలు వెంటనే స్పందించి ఆమెని పట్టుకున్నారు. లేకపోతే శ్రీదేవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి లోయలో పడిపోయే వారట ప్రమాదం తృటిలో తప్పింది. ఈ విషయాన్ని ఆ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కమెడియన్ విశ్వేశ్వరరావు చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading