Home » సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ “అగ్ని పర్వతం” సినిమా నుంచి శ్రీదేవిని మధ్యలోనే ఎందుకు తీసేసారు ?

సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ “అగ్ని పర్వతం” సినిమా నుంచి శ్రీదేవిని మధ్యలోనే ఎందుకు తీసేసారు ?

by AJAY
Ad

అందాల తార శ్రీదేవి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగు రాష్ట్రానికి చెందిన శ్రీదేవి బాలీవుడ్ లో రానించ‌డం టాలీవుడ్ కు సైతం గ‌ర్వ‌కారణం. బాల‌న‌టిగానే త‌న కెరీర్ ను ప్రారంభించిన శ్రీదేవి ఆ త‌ర‌వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్ప‌టి స్టార్ హీరోలు అంద‌రికి జోడీగా సినిమాలు చేసి అల‌రించింది.

Advertisement

అంతే కాకుండా స్టార్ హీరోలు సైతం శ్రీదేవి డేట్స్ కోసం ఎదురు చూసేవారు. చిరంజీవికి పోటీగా శ్రీదేవి రెమ్య‌న‌రేష‌న్ అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంతే కాకుండా తాను పెట్టిన కండిష‌న్స్ వ‌ల్ల శ్రీదేవి సినిమాలను మిస్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. స్టార్ హీరోయిన్ గా బిజీ అయిన త‌ర‌వాత శ్రీదేవి కోస‌మే సినిమాల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు ఉండేవారు.

Advertisement

దాంతో శ్రీదేవి కూడా క‌థ నచ్చ‌డంతో పాటూ త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటేనే ఆ సినిమాలో న‌టించేవారు. ఇదిలా ఉండగా కృష్ణ హీరోగా న‌టించిన ఓ సూప‌ర్ హిట్ చిత్రాన్ని శ్రీదేవి మిస్ చేసుకున్నారు. ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నారు..? ఇంత‌కీ ఆ సినిమా ఏంటి అన్న‌ది ఇప్పుడు చూద్దాం….సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా అగ్నిప‌ర్వ‌తం సినిమా తెరెక్కింది. ఈ సినిమాను అశ్విని ద‌త్ నిర్మించారు.

ఈ చిత్రంలో కృష్ణ‌కు జోడీగా ర‌మ్య‌కృష్ణ మ‌రియు రాధ హీరోయిన్ లు గా న‌టించారు. నిజానికి సినిమాలో హీరోయిన్ న‌టించే ఆఫ‌ర్ శ్రీదేవికి వెళ్లింది. ఆమె కూడా క‌థ న‌చ్చ‌డంతో సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. కానీ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ లు అని చెప్ప‌డంతో త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుంద‌ని భావించి రిజెక్ట్ చేశారు. అలా శ్రీదేవి అగ్నిప‌ర్వతం సినిమాను ఓకే చేసి ఆ త‌ర‌వాత రిజెక్ట్ చేశారు.

ALSO READ : హీరోయిన్స్ విష‌యంలో అక్కినేనికి, ఎన్టీఆర్ కి ఎంత తేడా ఉంటుందో తెలుసా..?

Visitors Are Also Reading