Home » సిరివెన్నెల రాసిన చివరి పాట ఎప్పుడు వస్తోందంటే…?

సిరివెన్నెల రాసిన చివరి పాట ఎప్పుడు వస్తోందంటే…?

by AJAY
Ad

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో కలకత్తా చుట్టూ తిరిగే కథతో ముడిపడి ఉండబోతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చారు. అయితే ఈ సినిమాలో ఇటీవల మరణించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాటను రాశారు. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యయన్ వెల్లడించారు.

Sirivennela seetharama sastry

Sirivennela seetharama sastry

అయితే ఈ పాటను ఈ నెల 7వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఈ పాట విడుదల చేస్తున్నట్టు పోస్టర్ కూడా విడుదల చేశారు. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు సిరి వెన్నెల రాసిన ఈ పాట విడుదల కానుంది. ఇప్పటి వరకూ సిరివెన్నెల ఎన్నో సినిమాలకు పాటలు రాసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో సూపర్ హిట్ పాటలను రాసిన ఆయన ఈ సినిమాలో తన చివరి పాటను రాశారు. దాంతో ఈ పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Advertisement

Shyam singaroy

Shyam singaroy

ఇదిలా ఉండగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని లుక్ డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతి శెట్టి, అంతేకాకుండా మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. మొదటిసారి నాని ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ముగ్గురు హీరోయిన్లు ఉండటం…లుక్ డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా సాయి పల్లవి త్రిశూలం పట్టుకొని కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Visitors Are Also Reading