Home » సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?

సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..?

by Anji
Ad

టీవీ షోల నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాల్లో పాడుత మోస్ట్ వాంటేడ్ సింగర్ గా మారిపోయింది మంగ్లీ. తన గాత్రంతో శ్రోతలను కట్టిపడేస్తుంది.  అది ఫోక్ సాంగ్ అయినా సరే.. ఐటెమ్ సాంగ్ అయినా సరే మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకులు కేరింతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే. సింగర్ గా మారిన అనతికాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పెను ప్రమాదమే తప్పింది.

Advertisement

Advertisement

సింగర్ మంగ్లీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లిలో జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి నవంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి సింగర్ మంగ్లీ హాజరయ్యారు. అర్థరాత్రి తర్వాత మేఘ్ రాజ్, మనోహర్ తో కలిసి ఆమె కారులో హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవే మీదుగా ఇంటికి బయల్దేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన డీసీఎం వ్యాన్.. వెనుక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీ కొట్టింది. దాంతో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. కాగా.. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.  ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు పోలీసులు.

Also Read : ఆ సినిమా లో బాలయ్య ని థియేటర్ స్క్రీన్ పై చూసి ఫాన్స్ ఒక రేంజ్ లో షాక్ అయ్యారు

Visitors Are Also Reading