Home » చందమామ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం గురూ..!

చందమామ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం గురూ..!

by Bunty
Ad

తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే సినిమా అవకాశాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయి… ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వారిలో మన అందాల ముద్దుగుమ్మ సింధు మీనన్ ఒకరు. చందమామ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి నటి సింధు మీనన్. ఈ భామ తెలుగులో భద్రాచలం, వైశాలి, రెయిన్ బో, శ్రీరామచంద్రులు, చందమామ తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

కాగా, ఈ నటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు “భద్రాచలం” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కన్నా ముందు కన్నడలో “రష్మీ” అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఈ అమ్మడు. కేవలం తెలుగు, కన్నడ లోనే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. ఇక ఈ అమ్మడు వరుస సినిమాలలో నటించినప్పటికీ ఒక సినిమాలో హీరోయిన్గా చేసి ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు తన వైవాహిక జీవితంపై దృష్టి పెట్టింది.

Advertisement

ఈ అమ్మడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి బ్రిటన్ దేశానికి చెందిన ప్రభు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వివాహ ఆనంతరం సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబంతో కాలాన్ని గడిపింది. ఇక కొన్ని రోజుల క్రితం సినిమాలకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటికి… ఆ సినిమాలు పెద్దగా హిట్ కాలేకపోయాయి. దీంతో అమ్మడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి తన కుటుంబంతో సంతోషంగా గడుపుతుంది. కొన్ని రోజులకి సినిమా అవకాశాలు మళ్లీ వచ్చినప్పటికీ నటనపై ఆసక్తి లేకపోవడంతో సింధు మీనన్ బ్రిటన్ దేశంలో సెటిల్ అయిపోయింది. సినిమాలకు దూరమైనప్పటికి సోషల్ మీడియాలో ఎప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading