Home » సిల్క్‌స్మిత చేసిన పనికి.. చిరంజీవి పాటను ముగ్గురితో చెయ్యాల్సి వచ్చింది..!

సిల్క్‌స్మిత చేసిన పనికి.. చిరంజీవి పాటను ముగ్గురితో చెయ్యాల్సి వచ్చింది..!

by Sravya
Ad

సిల్క్ స్మిత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఐటమ్ సాంగ్స్ కోసం ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారన్న విషయం తెలుసు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, డిస్కో శాంతి వంటి డాన్సర్స్ ఐటమ్ సాంగ్స్ లో నటించి ఆడియన్స్ ని ఆకట్టుకునేవారు అప్పట్లో టాప్ హీరోలందరి మూవీస్ లో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ఉండేవి. తర్వాత కాలంలో ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్ తోనే చేయిస్తూ వాటిని స్పెషల్ సాంగ్స్ గా చాలా మందిలోకి తీసుకురావడం జరిగింది. చిరంజీవి హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి రాజా మూవీలో ఐటమ్ సాంగ్ ఐ ఏకంగా ముగ్గురు డాన్సర్లతో చేయించారు. దీని వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.

Advertisement

Advertisement

ఈ ఐటమ్ సాంగ్ భారీగా తీయాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు సిల్క్ స్మితనే సెలెక్ట్ చేశారు 25000 రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు.కాల్యూషన్స్ కోసం 20000 అదనంగా ఇచ్చారు. చెన్నైలోనే వాహిని స్టూడియోలో ఐదు లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు నాలుగు నెలలు ముందే సిల్క్ స్మిత ని తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ని మొదలుపెట్టారు. షూటింగ్ కి వచ్చిన సిల్క్ స్మిత ని చూసి రాఘవేంద్రరావు షాక్ అయ్యారు. అప్పుడే నిద్ర లేచి వచ్చినట్లుగా ఆమె ఉన్నారు. హెయిర్ స్టైల్ చాలా చిందరవందరగా ఉంది. హెయిర్ స్టైల్ మార్చుమన్నారు.

సిల్క్ స్మిత ఆయన మాటలను పట్టించుకోలేదు రాఘవేంద్రరావుకి కోపం వచ్చింది. ఆమెతో వాదించలేక ఆయన పాటను షూట్ చేశారు. పొగ మంచులో కొంత షూట్ చేసారు. పొగ మంచును ఈ షాట్ కోసం స్ప్రెడ్ చేశారు సిల్క్ స్మిత ఫ్యాన్ వేసుకుని కూర్చోవడంతో పొగ మంచు పోయింది. ఇక ఆమెని తొలగించారు. అప్పటికి స్మితతో రెండు చరణాలు మాత్రమే చిత్రీకరించారు. పల్లవి ఇంకో చరణం ఉంటే జయమాలినితో అనురాధతో మిగిలినవి షూట్ చేశారు ఇలా ముగ్గురితో ఈ పాటని షూట్ చేస్తే బాగుంటుందని ఈ ముగ్గురితో పాటని షూట్ చేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading