Home » ఆస్తిలో తారకరత్న వాటాను ఆ ట్రస్ట్ కు రాశారా… అలేఖ్య రెడ్డికి అన్యాయమేనా?

ఆస్తిలో తారకరత్న వాటాను ఆ ట్రస్ట్ కు రాశారా… అలేఖ్య రెడ్డికి అన్యాయమేనా?

by Bunty
Ad

నందమూరి తారకరత్న మరణం అతని కుటుంబంలో తీర విశాదాన్ని నింపింది. ఇప్పటికి ఆయన చనిపోయారు అన్న నిజాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య రెడ్డి ఆవేదనను ఎవరు ఆపలేకపోతున్నారు. అలేఖ్యను తిరిగి మామూలు మనిషిని చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్న, ఆమె మాత్రం భర్త జ్ఞాపకాలతో మానసికంగా కుంగిపోతుంది.

tarakaratna-assest

Advertisement

తారకరత్న మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సినీ ప్రముఖులు తారకరత్నకు భారీగా ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేస్తుండగా, మరికొందరు మాత్రం తారకరత్నకు ఎలాంటి ఆస్తులు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నందమూరి ఫ్యామిలీలో ట్రస్టులు పెట్టి సేవా కార్యక్రమాలు చేశారని ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికీ నడిపిస్తున్నారని ఆయన తెలిపారు.

Advertisement

బాలయ్య బసవతారకం ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తారకరత్న, అలేఖ్య పెళ్లి వల్ల…ఆయన తండ్రి తన ఆస్తులను కూతురు అయిన రూపకు రాసారని తెలుస్తోంది. ఈ ఆస్తిలో తారకరత్న వాటాను తారకరత్న ట్రస్ట్ కు ఉపయోగించాలని భావిస్తున్నారని బోగట్ట. అయితే ఇలా చేస్తే మాత్రం అలేఖ్య రెడ్డికి ఆస్తిలో వాటా దక్కదు. ఇలా చేస్తే మాత్రం అలేఖ్య కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. బాలయ్య జోక్యం చేసుకుని అలేఖ్యకు, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : తారకరత్న కోరిక తీర్చనున్న భార్య అలేఖ్య!

Visitors Are Also Reading