Home » కూతురు చేసిన పనికి కన్నీరు పెట్టుకుంటున్న నటుడు రాజేంద్రప్రసాద్..!!

కూతురు చేసిన పనికి కన్నీరు పెట్టుకుంటున్న నటుడు రాజేంద్రప్రసాద్..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా..కమెడియన్ గా.. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు రాజేంద్రప్రసాద్. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఆయనను మించిన నటుడు లేరని చెప్పవచ్చు. సీనియర్ కమెడియన్లలో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన రాజేంద్రప్రసాద్,హీరోగా కూడా కొన్ని సినిమాల్లో మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఆయన నటనా టాలెంటును గుర్తించి నట కిరీటి అంటూ బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు.

జీవితంలో ముక్కుసూటి మనిషి. ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాడు. ఆయన కొన్ని సినిమా ఫంక్షన్లలో మాట్లాడిన స్పీచ్ వింటే ఆయన ఖచ్చితమైన మనిషి అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక రాజేంద్రప్రసాద్ నిజ జీవితంలోకి వెళ్తే అనేక కష్టాలు ఉన్నాయి. ఆయన కుటుంబం నుంచి ఎవరు కూడా ఇండస్ట్రీ లోకి రాలేదు. అయితే ఒక సందర్భంలో ఆయన తన కూతురు గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బేవార్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.. ఈ చిత్రంలో సుద్ధాల అశోక్ తేజ అమ్మపై ఒక సాంగ్ రాశారు. దాన్ని వివరిస్తూ అమ్మ లేని వ్యక్తులు కూతురిలో అమ్మను చూసుకుంటారు. నా 10 ఏళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు. నేను కూడా నా కూతురిలో మా అమ్మని చూసుకున్నాను. కానీ ప్రస్తుతం నా కూతురుకు నాకు అసలు మాటలు లేవు. ఆమె ప్రేమించిన వాడితో నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయితే ఈ పాటను నా కూతురును ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అన్నారు రాజేంద్రప్రసాద్. అయినా ఆమెలో ఏ మార్పు రాలేదంటూ ఎమోషనల్ అయ్యారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

also read:

Visitors Are Also Reading