Home » sep 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

sep 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
Ap cm jagan

Ap cm jagan

కడపలో 3 రోజుల పాటు సీఎం జగన్ పర్య‌టించ‌నున్నారు. నేడు మధ్యాహ్నం తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరనున్నారు. రేపు ఉ. 9 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర సీఎం జగన్‌ నివాళి అర్పిస్తారు. మధ్యాహ్నం పులివెందుల అభివృద్ధిపై సమీక్షస‌మావేశం నిర్వహిస్తారు. రాత్రికి ఇడుపులపాయలో బస చేసి 3న ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్ర‌యాణం అవుతారు.

నేటి నుంచి జరగాల్సిన నీట్-పీజీ కౌన్సెలింగ్‌ వాయిదా వేశారు. కొత్త తేదీల‌ను ఖ‌రారు చేయ‌గానే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు.

Advertisement

ఆసియా కప్ లో భాగంగా నేడు శ్రీలంకతో బంగ్లాదేశ్ త‌ల‌ప‌డ‌నుంది. దుబాయ్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ నెల 3న ఆర్టిమిస్-1 ను ప్రయోగించనున్నట్టు నాసా ప్రకటించింది. చంద్రుడిపైకి వ్యోమ నౌకలను పంపేందుకు ఆర్టిమిస్‌-1 ప్రయోగం జ‌రుపుతున్నారు.

Advertisement

భార‌త్ హాంకాంగ్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం కించిత్ షా త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ కు ప్ర‌పోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

బిహార్ టూర్ లో సీఎం కేసీఆర్ స‌రికొత్త లుక్ లో క‌నిపించారు. సిక్కుల త‌ల‌పాగాలో కేసీఆర్ సందడి చేయ‌గా ఆయ‌న‌ను చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

ఏపీలోని అల్లూరి జిల్లా ముంచంగిప‌ట్టులో ఆంత్రాక్స్ వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. దాంతో అప్ర‌మ‌త్త‌మైన ఆరోగ్య‌శాఖ ల‌క్ష‌నాలు ఉన్నా ఏడుగురి పై ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.

ఖైర‌తాబాద్ లో నిన్న మ‌హాగ‌ణ‌పతి కొలువుదీరాడు. రాజ‌కీయ సినీ ప్ర‌ముఖులతో పాటూ హైద‌రాబాద్ మ‌రియు ఇత‌ర ప్రాంతాల నుండి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ద‌ర్శించుకోవడానికి వ‌స్తున్నారు.

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసులు మ‌రింత త‌గ్గుముకం ప‌ట్టాయి. గడిచిన 24 గంట‌ల్లో 2.66ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Visitors Are Also Reading