Home » క్షీణించిన సమంత ఆరోగ్యం.. అపోలో ఆసుపత్రికి తరలింపు ?

క్షీణించిన సమంత ఆరోగ్యం.. అపోలో ఆసుపత్రికి తరలింపు ?

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి ప్రాణాంతకరం కావడంతో సమంత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సమంతకి మూడో స్టేజీలో ఉన్నట్టు సమాచారం. నెల రోజుల కిందట మయోసైటిస్ కి సంబంధించి చికిత్స తీసుకుంది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు తన తొలి పాన్ ఇండియా హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమా యశోద ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది సమంత. 

Advertisement

నవంబర్ 11న యశోద విడుదలైన అద్భుతమైన విజయం సాధించింది. అంతకు ముందు వారం రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొంది. ఆ సమయంలో సరైన డైట్ తీసుకోకపోవడంతో పాటు సరైన సమయంలో ట్రీట్ మెంట్ నిర్లక్ష్యం చేయడంతో సమంత ఆరోగ్యం ఇప్పుడు మరింత క్షీణించడం జరిగిందట. దీంతో ఆమెను ఇప్పుడు హోటల్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. యశోద ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో రీసెంట్ గా బాగా నీరసించిపోయి కండరాల నొప్పి ఎక్కువై స్పృహ తప్పిందట. ఇక వైద్యులు వెంటనే సమంతను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Also Read :   ఎన్టీఆర్ న్యూలుక్.. సోషల్ మీడియా షేక్..!

సమంత ఆరోగ్యం విషమించినట్టు సమాచారం. మరోవైపు బయట జరుగుతున్న ఈ ప్రచారంపై సమంత బంధువులు లేదా ఆమె పీ ఆర్ టీ మ్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఇటీవలే నాగచైతన్య–సమంత దంపతులు మళ్లీ కలుస్తున్నారనే వార్తలు వినిపించిన తరుణంలోనే సమంత ఆసుపత్రిలో పడడంతో అభిమానులు కాస్త బాధతో ఉన్నట్టు కనిపిస్తోంది. కొంత మంది అభిమానులు సమంత మయోసైటిస్ వ్యాధి బారీ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

Also Read :   ఊహతో విడాకులపై స్పందించిన శ్రీకాంత్.. ఏమన్నారంటే ?

Visitors Are Also Reading