టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఇప్పటికీ కొనసాగుతున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత… ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.
అంతేకాకుండా ఏ మాయ చేసావే సినిమాతోనే అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడిపోయింది హీరోయిన్ సమంత. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య మరియు సమంత దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలోనే వివాహం కూడా చేసుకున్నారు. 2017 సంవత్సరంలో వీరి వివాహం జరగకగా… 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఇద్దరు విడిపోయారు.
Advertisement
ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంత విడివిడి గానే ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జూబ్లీహిల్స్ లోని ప్రీస్కూల్ లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలతో ఆమె కనిపించారు. ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక చిన్నారి, మరియు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలరని… అందరికీ అదే కావాలని పేర్కొంది సమంత.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!