పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీ సార్టర్లుగా తెరకెక్కిన బ్రో చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.ఈ సినిమా విడుదల అయ్యాక మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో ఒక సాంగ్ అంబటి రాంబాబు ని ఇమిటేట్ చేస్తూ తీసారని బయట టాక్ నడుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దీని గురించి స్పందించిన అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ పై నేను కూడా సినిమాలు తీయిస్తా అంటూ రకరకాల పేర్లు చెప్పారు. ఈ వివాదం ఇలా నడుస్తూ ఉండగానే.. పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ నెట్టింట్లో చర్చలు రేపింది.
Advertisement
Advertisement
అందం అభినయం ఉండీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్స్ లో పూనమ్ కౌర్ కూడా ఉంటారు. గతంలో పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది. “రాజకీయాలు వినోదాత్మకంగా మారాయి.. సినిమాలు మాత్రం చాలా సీరియస్ గా ఉంటున్నాయి..” అంటూ ఆమె ట్వీట్ చేసారు. అయితే ఎవరినీ టాగ్ చేయలేదు. కనీసం పేరు కూడా మెన్షన్ చేయలేదు. కానీ, ఆమె బ్రో సినిమాను ఉద్దేశించే కామెంట్ చేసారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆర్జీవీ చేసిన మరో ట్వీట్ సంచలనం అయ్యింది. పూనమ్ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. “అవును సిస్టర్.. రాజకీయాలు సినిమాల మారాయి. సినిమాలు పొలిటికల్ గా మారాయి” అంటూ ఆర్జీవీ కామెంట్స్ చేసారు. దీనితో ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది.
మరిన్ని..
వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !