Home » దేవుడి పై ఒట్టేసి కూడా రేణూ దేశాయ్ అబద్దం చెప్పిందా…? అలా ఎందుకు చేసింది..?

దేవుడి పై ఒట్టేసి కూడా రేణూ దేశాయ్ అబద్దం చెప్పిందా…? అలా ఎందుకు చేసింది..?

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మూడు పెళ్లిళ్ల వ్యవహారం తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. వైసిపి నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై అనేకసార్లు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రీసెంట్ ఈ వ్యవహారంపై మండిపడ్డారు.

Advertisement

ప్రెస్ మీట్ లో వైసీపీ నాయకులను పవన్ ఏకి పారేశారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని… మీరు ఒక పెళ్లి చేసుకుని 30 మంది స్టెఫినీలను మెయింటైన్ చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. తను మొదటి భార్యకు ఐదు కోట్లు భరణం గా ఇచ్చానని…. రెండో భార్యకు తన ఆస్తిలో సగం భరణంగా ఇచ్చానని చెప్పాడు.

Advertisement

అంతేకాకుండా రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మూడో భార్యను వివాహం చేసుకున్నానని చెప్పారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ తో విడాకుల అనంతరం రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భరణంగా ఒక రూపాయి కూడా తీసుకోలేదని ….కాళీ చేతులతో బయటకు వచ్చానని తెలిపింది.

తను చిన్నప్పటినుండే డబ్బులు సంపాదిస్తున్నానని తనకు పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని రేణూ దేశాయ్ వెల్లడించింది. ఏ దేవుడిపై ప్రమాణం చేసి చెప్పమన్నా చెబుతానని తాను ఒక రూపాయి కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యకు సగం ఆస్తిని భరణంగా ఇచ్చానని ప్రెస్ మీట్ లో చెప్పాడు. దాంతో ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్పారు అన్నది అర్థం కాక నెటిజన్లు తల పట్టుకుంటున్నారు.

Visitors Are Also Reading