Home » చిరంజీవికి సాయి పల్లవి నో ఎందుకు చెప్పిందో మీకు తెలుసా..?

చిరంజీవికి సాయి పల్లవి నో ఎందుకు చెప్పిందో మీకు తెలుసా..?

by Azhar
Ad
ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్ లలో సాయి పల్లవి కూడా ఒక్కరు. అయితే సాయి పల్లవి మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా తనదైన నడవడికతో మరి కొంత మంది అభిమానులను సంపాదించుకుంది పల్లవి. తనకు నచ్చితేనే సినిమా చేయడం.. లేకపోతే ఎంత పెద్ద హీరోకైనా నో చెప్పడం సాయి పల్లవికి అలవాటు. ఇది కూడా అభిమానులకు నచ్చిన విషయమే. అయితే ఇలా పల్లవి నో చెప్పిన హీరోలలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఆయనతో ఓ సినిమాలో చేయడానికి పల్లవి నో చెప్పింది.
అయితే తాజాగా ఇందుకు కారణాలను ఆమె వివరించింది. తాజాగా పల్లవి పాల్గొన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ.. నాకు ఆయన అంటే చాల ఇష్టం. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. ఆయన చేసిన విధంగా డ్యాన్స్ ఎవరు చేయలేరు. ఆయనలోనే గ్రెస్ ఎవరిలో లేదు. అందుకే గ్రెస్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే గ్రెస్ అంటూ పేర్కొంది. ఈ క్రమంలోనే మీరు ఆయనకు ఇంత పెద్ద ఫ్యాన్ అయినప్పుడు ఆయనతో సినిమాకు ఎందుకు నో చెప్పారు అనే ప్రశ్న పల్లవికి ఎదురైంది.
దీనికి సమాధానంగా.. నాకు ఆయన చేస్తున్న బోళా శంకర అనే సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అది రీమేక్ సినిమా. అందుకే నేను నో చెప్పను. రీమేక్ సినిమా చేయడం వల్ల కంపారిజాన్ అనేది పెరుగుతుంది. ఒరిజినల్ లో వారు ఎలా చేసారు.. ఇంహులో ఎలా చేసారు.. ఎవరు బాగా చేసారు అనే ప్రశ్నలు వస్తుంటాయి. అందుకే నేను ఆ సినిమాలో చేయనని చెప్పను అంటూ  పల్లవి పేర్కొంది. ఇక ప్రస్తుతం పల్లవి నటించిన విరాటపర్వం అనే సినిమా విడుదల కాబోతుంది. ఇందులో రానా హీరోగా ఉన్నాడు.

Advertisement

Visitors Are Also Reading