నటి మరియు యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేసిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలను ధక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో అనేక పాత్రలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బిగియేస్ట్ నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.
Advertisement
కొంతకాలం క్రితం అనసూయ… అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ అనే పాన్ ఇండియా మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అనసూయ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది.
దానితో ప్రస్తుతం ఈ నటికి అనేక భాషలలో సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
Advertisement
ఇలా పరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా కెరియర్ను గడుపుతున్నప్పటికీ అనసూయ అప్పుడప్పుడు వీలు చిక్కినప్పుడల్లా టాలీవుడ్ యువ హీరో అయినటువంటి విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదివరకు ఎన్నో సార్లు అనసూయ… విజయ్ ను ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా అనసూయ… విజయ్ ని ట్రోల్ చేసింది. ఇలా అనసూయ విజయ్ ను ట్రోల్ చేయడానికి ప్రధాన కారణం ఇదే అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
jabardasth anasuya
అసలు విషయంలోకి వెళితే … విజయ్ దేవరకొండ హీరోగా రూపొందినటువంటి లైగర్ మూవీ అపజయం చెందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఒక పార్టీలో ఈ విషయంపై విజయ్ దేవరకొండ కు సుసంక్ భరద్వాజ్ (అనసూయ భర్తకు) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. పార్టీలో లైగర్ వైఫల్యం పై అనసూయ చేసిన వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా ఖండించారట. దీనితో విజయ్ పై అనసూయక కోపం పెంచుకున్నట్లు దానితో ఆమె ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అతడిని ట్రోల్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.