Home » ఆ కేసుపై మొదటిసారి స్పందించిన రవితేజ…పెంట పెంట చేశారంటూ ఎమోషనల్..!

ఆ కేసుపై మొదటిసారి స్పందించిన రవితేజ…పెంట పెంట చేశారంటూ ఎమోషనల్..!

by AJAY
Published: Last Updated on

ఆహాలో ప్రసారమవుతున్న ఎన్బీకే అన్ స్టాపబుల్ టాక్ షోకు అతిథిగా మాస్ మహారాజ్ రవితేజ హాజరయ్యారు. రవితేజ తో పాటు ఈ షోకు దర్శకుడు గోపీచంద్ మలినేని సైతం వచ్చారు. రవితేజకు గోపీచంద్ రెండు సూపర్ హిట్లు అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలయ్య తో గోపీచంద్ మలినేని ఓ సినిమా చేయబోతున్నారు. అయితే తాజాగా రవితేజ, బాలయ్య ఎపిసోడ్ పై ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ఎంతో ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. ప్రోమోలో మాస్ మహారాజ్ తో నటసింహం నందమూరి బాలయ్య నవ్వులు పూయించారు. ఇద్దరూ కలిసి షోను ఒక రేంజ్ కు తీసుకువెళ్లినట్టు కనిపిస్తోంది.

Balakrishna raviteja

Balakrishna raviteja

అయితే మొదటిసారిగా ఈ ఎపిసోడ్ లో తనపై వస్తున్న  ఆరోపణల పై రవితేజ స్పందించారు. గతంలో రవితేజ మత్తుపదార్థాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రవితేజ విచారణకు సైతం హాజరయ్యారు. కానీ ఎప్పుడూ ఆ కేసు పై స్పందించలేదు. కాగా టాక్ షోలో బాలయ్య “ఎంతో ఫిట్నెస్ గా ఉంటూ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే నీ పైన ఆరోపణలు ఎలా వచ్చాయి” అంటూ రవితేజను ప్రశ్నించారు. దానికి రవితేజ ఎమోషనల్ అయ్యారు. ఆ విషయం తనను చాలా బాధించిందని చెప్పారు. చూస్తుండగానే పెంట పెంట చేశారంటూ రవితేజ ఆవేదన వ్యక్తం చేశారు.

Also read : సెకండ్ హ్యాండ్ అంటూ నెటిజెన్ కామెంట్… రిప్లైతో చెంప చెళ్లుమనిపించిన సమంత..!

అయితే నిజానికి  కేసు పై రవితేజ ఏమని స్పందించారో తెలియాలంటే మాత్రం షో చూడాల్సిందే. మరోవైపు కుర్ర వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలకు బీట్ చేసే వాడివి వెంట అంటూ బాలయ్య రవితేజతో జోకులు వేశారు. దాంతో ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు అంటూ రవితేజ నవ్వుకున్నారు. అంతే కాకుండా తన కుమారుడు తన కంటే చాలా షార్ప్ అని అందుకే అతడి పేరును సెల్ ఫోన్ లో డిఎంకే అని ఫీడ్ చేసుకున్నా అని చెప్పారు. అంటే దొంగ నా కొడుకు అని అర్థం అంటూ మాస్ మహారాజ్ చెప్పుకొచ్చారు. ఇక రవితేజ బాలయ్యల సందడి చూడాలంటే పూర్తి ఎపిసోడ్ రావాల్సిందే.

Visitors Are Also Reading